సస్పెన్స్ కంటిన్యూ : మంత్రి గంటాతో ఆలీ 

  • Published By: madhu ,Published On : January 9, 2019 / 03:05 PM IST
సస్పెన్స్ కంటిన్యూ : మంత్రి గంటాతో ఆలీ 

విజయవాడ : సినీ నటుడు, కమెడియన్ ఆలీ పొలిటికల్ ఎంట్రీ సస్పెన్స్ తలపిస్తోంది. ఆయన ఏ పార్టీలో చేరుతారా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. వరుసగా ఆయన వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతుండడంతో ప్రాధాన్యత సంతరించుకొంటోంది. తాజాగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఆలీ భేటీ అయ్యారు. 
వెండితెరపై నవ్వులు పూయించే ఆలీ మేకప్ తీసేసి రాజకీయ మేకప్ వేసుకోవాలని అనుకుంటున్నాడు. పొలిటికల్ ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. అయితే ఏ పార్టీలో చేరుతారనేది డౌట్‌ ఇంకా కొనసాగుతోంది. గత కొన్ని రోజుల క్రితం ప్రతిపక్ష నేత జగన్‌తో భేటీ కావడంతో ఆలీ వైసీపీలో చేరుతారని టాక్ వినిపించింది. కొద్ది రోజులకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. వైసీపీలో కాదు…టీడీపీ కండువా కప్పుకుంటారనే చర్చ జరిగింది. అనంతరం ఆలీ నేరుగా జనసేన అధినేత పవన్‌తో ముఖాముఖి జరిపారు. జనసేన పార్టీలో చేరాలని పవన్ ఆహ్వానించినట్లు..ఆలోచిస్తానని ఆలీ చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఇది జరిగిన కొద్ది రోజులకు గంటాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఆలీ పేర్కొన్నట్లు టాక్. గుంటూరు నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అనుకున్నట్లు గంటా చెవిలో ఆలీ వేశారంట. మరి ఆయన ఏ పార్టీ కండువా కప్పుకుంటారు ? అనేది ఎప్పుడు తెలుస్తుందో ఏమో అని జనాలు గుసగుసలాడుకుంటున్నారంట.