కాంగ్రెస్ నా కులాన్ని అవమానించింది
వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మోడీ వర్గీయులను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అవమానిస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు.మహారాష్ట్రలోని అక్లుజ్ లో బుధవారం(ఏప్రిల్-17,2019) ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ….బీజేపీ నాయకులందరూ చౌకీదార్ అని పేరు ముందు స్లోగన్ పెట్టుకుంటే, దాన్ని రాహుల్ చౌకీదార్ చోర్ హై అని మార్చేశాడు. ఇప్పుడు మోడీ పేరున్న వాళ్లందరూ మోసగాళ్లు అంటూ రాహుల్ గాంధీ,ఇతర కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.నన్ను విమర్శిస్తే పట్టించుకోను కానీ నా కులాన్ని కాంగ్రెస్ విమర్శంచడం బాధ కలిగించింది.నన్ను ఒక్కడినే కాకుండా, మొత్తం మా సామాజిక వర్గాన్నే కాంగ్రెస్ అవమానిస్తోందని ప్రధాని ఆరోపించారు.సామాజికంగా వెనుకడిన వర్గానికి చెందిన తనను ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ వేధిస్తోందని ప్రధాని తెలిపారు. ఓ సామాజిక వర్గాన్నికించపరచాలని చూస్తే, దాన్ని ఏరకంగా సహించేది లేదని మోడీ అన్నారు.
ఇటీవల జరిగిన ఓ సభలో రాహుల్ మాట్లాడుతూ.. మోడీ పేరున్న వారు దేశాన్ని దోచుకున్నారని అన్నారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ పేర్లలో మోడీ అని ఎందుకు ఉందని రాహుల్ ప్రశ్నించారు. మోడీ అని పేరున్నవారంతా దొంగలే అని రాహుల్ అన్నారు.