లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి దంపతుల ప్రాణాలు బలి
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం..ర్యాష్ డ్రైవింగ్ లకు దంపతుల ప్రాణాలు బలైపోయాయి. విశాఖపట్నం జిల్లా కసింకోట మండలం తాళపాలెం నేషనల్ హైవేపై నడిచి వెళ్తున్న దంపతులను పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు వెంటనే వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మృతులు తాళపాలెం గ్రామానికి చెందిన కరణం సోమినాయుడు, పైడితల్లిగా గుర్తించారు.
అతివేగంగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ భార్యాభర్తలిద్దరినీ బలంగా ఢీకొట్టింది. అనంతరం పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
కాగా నిర్లక్ష్యం, అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లకు ఎన్నో ప్రాణాలు బలైపోతున్నాయి. కానీ డ్రైవింగ్ చేసే సమయంలో కనీస నిబంధనల్ని కూడా పాటించకపోవటంతో ఎన్నో కుటుంబాల్లో విషాదాలు నిండుకుంటున్నాయి. ఇటువంటి ప్రమాదంలోనే విశాఖపట్నంలోని దంపతులు బలైపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.