విషాదం : ప్రాణహిత నదిలో గల్లంతైన ఫారెస్ట్ ఆఫీసర్లు మృతి 

  • Published By: veegamteam ,Published On : December 2, 2019 / 04:30 AM IST
విషాదం : ప్రాణహిత నదిలో గల్లంతైన ఫారెస్ట్ ఆఫీసర్లు మృతి 

ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతు అయిన ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మృతి చెందారు. ఆదివారం (డిసెంబర 1) అసిఫాబాద్ చింతలమానేపల్లి మండలం గూడెం దగ్గర ప్రాణహిత నదిలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్లు బాలకృష్ణ, సురేష్ ల మృతదేహాలు లభ్యమయ్యాయి. నదిలో చేపలు పట్టుకుంటున్న జాలర్ల వలకు ఫారెస్ట్ ఆఫీసర్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. 

మహారాష్ట్రలోని హాహిరి నుంచి చింతలమానేపల్లి మండలం గూడెంకు నాటుపడవలో ఆరుగురు అధికారులు వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ఆఫీసర్లు గల్లంతు అవ్వగా వీరిలో  నలుగురు అధికారులు క్షేమంగా ఒడ్డుకు చేరుకోగా బాలకృష్ణ, సురేష్ లు ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై సమచాారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు నదిలో గాలింపు చర్యల్ని ముమ్మరం చేసారు. అయినా లభించలేదు. ఈ క్రమంలో నదిలో చేపలు పట్టుకునే జాలర్ల వలలకు గల్లంతైన ఆఫీసర్ల మృతదేహాలు లభ్యమయ్యాయి.