క్యూలో వెళ్లి ఓటేసిన ఢిల్లీ సీఎం

  • Published By: venkaiahnaidu ,Published On : May 12, 2019 / 05:18 AM IST
క్యూలో వెళ్లి ఓటేసిన ఢిల్లీ సీఎం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటు వేశారు. సివిల్ లైన్స్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019)ఉదయం క్యూలో వెళ్లి కేజ్రీవాల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆరో దశలో భాగంగా ఇవాళ ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.ఢిల్లీలోని మొత్తం 7లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది.2014 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్ సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.అయితే ఈ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీని ఓడించాలన్న పట్టుదలతో ఆప్,కాంగ్రెస్ లు పనిచేశాయి