బండల నాగాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను నిజం చేస్తుంది. బండల నాగాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభోత్సవం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలతో ఈ ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నది.
నాగాపూర్లో గత ఏడాది ప్రారంభమైన 100 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. పేదల కోసం అన్ని రకాల సౌకర్యాలతో నిర్మించిన ఇండ్లను ఈ రోజు MP నగేశ్, ఆదిలాబాద్ బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ శోభారాణి ప్రారంభించారు. ఎన్నో ఏండ్ల నుంచి కలలు కంటున్న పేదవారు సొంతింటి కల సాకారం కావడంతో వారి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.