చిలకలూరిపేట పెట్రోల్‌ బంక్‌లో విద్యుత్ షాక్ : ముగ్గురు కార్మికులు మృతి 

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 08:45 AM IST
చిలకలూరిపేట పెట్రోల్‌ బంక్‌లో విద్యుత్ షాక్ : ముగ్గురు కార్మికులు మృతి 

గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిలకలూరిపేట మండలం రామచంద్రపురంలోని ఓ  పెట్రోల్ బంక్‌లో విద్యుత్ షాక్‌తో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పెట్రోల్‌ బంక్‌లో ఓ బల్బ్ పాడవడంతో దాన్ని మార్చేందుకు ఇనుప స్టాండ్‌ను తీసుకువస్తుండగా అది హైటెన్షన్ వైర్లకు తగిలింది. 

దీంతో ఐరన్ స్టాండ్‌ను పట్టుకున్న ముగ్గురు వ్యక్తులు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మౌలాలి(25), శ్రీనివాసరావు(40), శేఖర్‌(45)గా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. పొట్టకూటికోసం వచ్చినవారు ఇలా అనుకోకుండా ప్రమాదానికి గురైన మృతి చెందటంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.