వరి కోత యంత్రంలో పడి కౌలు రైతు మృతి

నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది. వరి కోత యంత్రంలో పడి కౌలు రైతు మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : November 24, 2019 / 02:20 AM IST
వరి కోత యంత్రంలో పడి కౌలు రైతు మృతి

నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది. వరి కోత యంత్రంలో పడి కౌలు రైతు మృతి చెందారు.

నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది. వరి కోత యంత్రంలో పడి కౌలు రైతు మృతి చెందారు. ఊట్కూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బోయ రాజు కౌలు రైతు. ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామ శివారులోని తిమ్మయ్య అనే రైతుకు చెందిన 5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. 

వరి పంట చేతికి రావడంతో కర్నాటకకు చెందిన వరి కోత యంత్రం సాయంతో శనివారం(నవంబర్ 23, 2019) పంటను కోస్తున్నారు. వరి కోత కోస్తుండగా కౌలు రైతు బోయ రాజు ప్రమాదవశాత్తు యంత్రంలో పడి రైతు మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

కౌలు రైతు మృతితో కుటుంబం కన్నీరుమున్నీరయింది. ఆ కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయింది. అతని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.