నెల రోజుల పసిగుడ్డును నీటి తొట్టెల పడేసి చంపిన తండ్రి

  • Published By: veegamteam ,Published On : October 1, 2019 / 03:57 AM IST
నెల రోజుల పసిగుడ్డును నీటి తొట్టెల పడేసి చంపిన తండ్రి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రేగుంటలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల పసిగుడ్డును పాశవికంగా చంపేసాడు కన్నతండ్రి. భార్యకు రెండవసారి కూడా ఆడపిల్లే పుట్టిందనే కోపంతో విచక్షణ మరచిపోయే తండ్రి కన్నబిడ్డ పాలిట కాలయముడిగా మారాడి. 30 రోజుల పసిబిడ్డను..నీటి తొట్టెలో పడవేసి చంపేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి  చేరుకుని పరిస్థితిని సమీక్షించి కసాయి తండ్రి సూర్యతేజను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

రేగుంటలో నివసిస్తున్న సూర్యతేజకు మొదట ఓ ఆడబిడ్డ ఉంది. రెండవసారి గర్భందాల్చిన భార్యకు కాన్పులో మరో ఆడపిల్ల పుట్టింది. అప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న సూర్యతేజ ఆ బిడ్డను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. అదను కోసం వేచి చూశాడు. ఈ క్రమంలో అక్టోబర్ 1తేదీన వేకువఝామున భార్య బహిర్భూమికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన సూర్యతేజ నెలరోజుల పసిబిడ్డ అని కూడా చూడకుండా ఇంటి వెనుక ఉన్న నీటి తొట్టెలో పడవేయటంతో చిన్నారి మృతి చెందింది. తరువాత ఏమీ తెలియనట్లుగా ఉండిపోయాడు.

బైటకు వెళ్లిన వచ్చిన భార్య మంచంపై ఉండే బిడ్డ కనపించకపోవటంతో భర్తను అడిగింది. నాకేమీ తెలీదు నేను కూడా బైటకు వెళ్లాను అన్ని బుకాయించాడు. దీంతో కడుపుడు శోకంతో బిడ్డకోసం పిచ్చిదాన్లా వెతికింది. కనిపించకపోవటతో దగ్గర్లో ఉన్న తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది.వారు కూడా స్థానికులు సహాయంతో చుట్టుపక్కల అంతా వెతికారు. కానీ బిడ్డ కనిపించలేదు. ఎవరైనా ఎత్తుకుపోయారేమోనని భయపడ్డారు.కానీ ఇంటి వెనుక నీటితో తొట్టెలో ఉన్న పసిబిడ్డ విగతజీవిగా పడి ఉండటం చూసిన తల్లి గుండెలవిసేలా భోరుమని ఏడ్చింది. 

అనుమానం వచ్చిన భార్యా..స్థానికులు సూర్యతేజను నిలదీయగా..రెండవ సారి కూడా ఆడపిల్ల పుట్టిందని చంపేశాను అని  చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు సూర్యతేజకు దేహశుద్ధి చేసి..పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని సూర్యతేజను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.