ఇంట్లో పెట్రోల్‌ విక్రయిస్తుండగా అగ్నిప్రమాదం…ఇద్దరు చిన్నారుల సజీవ దహనం

  • Published By: veegamteam ,Published On : March 4, 2020 / 03:44 PM IST
ఇంట్లో పెట్రోల్‌ విక్రయిస్తుండగా అగ్నిప్రమాదం…ఇద్దరు చిన్నారుల సజీవ దహనం

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. చక్రాపురంతండాలోని ఓ ఇంట్లో లూజ్‌ పెట్రోల్‌ విక్రయిస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు కన్నుమూశారు. ఘటనా స్థలంలోనే బాలిక మృతి చెందగా… ఆస్పత్రికి తరలిస్తుండగా బాలుడు చనిపోయాడు.

ఇద్దరు చిన్నారులు మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. గుండెలవిసేలా రోధిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.