UP : బీజేపీ నేతపై కాల్పులు..అక్కడికక్కడే చనిపోయిన సంజయ్‌ ఖోఖర్‌

  • Published By: nagamani ,Published On : August 11, 2020 / 11:30 AM IST
UP : బీజేపీ నేతపై కాల్పులు..అక్కడికక్కడే చనిపోయిన సంజయ్‌ ఖోఖర్‌

యూపీలో బీజేపీ కీలక నేతపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. బాగ్‌పత్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు సంజయ్‌ ఖోఖర్‌ను ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపేశారు. మంగళవారం (ఆగస్టు11,2020) ఉదయం పోలానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ దారుణం చోటు చేసుకోవటంతో స్థానికంగా కలకలం రేపింది. కాల్పులకు ప్రమాద స్థలంలోనే సంజయ్‌ ఖోఖర్‌ ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు ఇచ్చిన సమచారంతో పోలీసులు హుటాహుటిన ఘటానా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. చప్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగిన తీరును బట్టి చూస్తే ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఖోఖర్ మరణంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.



సంజయ్ సంజయ్‌ ఖోఖర్‌ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అంతకు ముందే మాటు వేసిన దుండగులు ఈ దాడికి తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఆయన శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే అతడు పొలంలో రక్తపు మడుగులో పడిచనిపోయారు. పాతకక్ష్యలే దీనికి కారమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.



కాగా ..బాగ్‌పట్‌లో ఇదే తరహాలో ఆర్‌ఎల్‌డి సీనియర్ నాయకుడు డెస్ఫాల్ ఖోఖర్ హత్యకు గురయ్యారు. అధికార పార్టీ నేతపై ఇలాంటి దాడి జరగడం సంచలనం రేపింది. దీనిపై పలువురు రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.