వ్యాన్ – ఆటో ఢీ: నలుగురు మృతి 

  • Published By: veegamteam ,Published On : November 1, 2019 / 04:12 AM IST
వ్యాన్ – ఆటో ఢీ: నలుగురు మృతి 

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మంగళగిరి మండలం పెద్ద వడ్లపూడిలో ఓ పాల వ్యాన్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. తెనాలి నుంచి మంగళగిరి వెళ్తున్న పాలవ్యాన్ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరువ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలవ్వగా..వారిని సమీపంలోని హాస్పిటల్ కు  తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయారు.
 
ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన వచ్చి పరిస్థితిని సమీక్షించారు.అనంతరం మృతులు వెంకయ్య, నాగేశ్వర రావు, పవన్ గుర్తించారు. వీరంతా పెద్ద వడ్లపూడి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.