అందరికీ ఉచితంగా మాస్కులు, ఒక్కొక్కరికి 3.. కరోనా కట్టడికి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయనుంది. ప్రతి

  • Published By: veegamteam ,Published On : April 12, 2020 / 08:04 AM IST
అందరికీ ఉచితంగా మాస్కులు, ఒక్కొక్కరికి 3.. కరోనా కట్టడికి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయనుంది. ప్రతి

కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయనుంది. ప్రతి వ్యక్తికీ మూడు చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కుల పంపిణీ చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కరోనా హైరిస్క్ ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులతో చెప్పారు. కోవిడ్‌ 19 నివారణా చర్యలపై సీఎం నివాసంలో జరిగిన సమీక్షా సమావేశానికి సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరుయ్యారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్క్‌ల పంపిణీ చేయాలని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలోని 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి ఆదేశాలు ఇచ్చారు. వీలైనంత త్వరగా మాస్క్ లు పంపిణీ చేయాలన్నారు.

1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తి:
రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాల్లో 1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తయిందని అధికారులు వెల్లడించారు. 32,349 మందిని వైద్యాధికారులకు రిఫర్‌ చేశారు. ఇందులో 9,107 మందికి పరీక్షలు అవసరమని నిర్ధారించారు. వీరే కాకుండా 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. కరోనా కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45వేల కోవిడ్‌ పరీక్షలకు అధికారులు సిద్ధమవుతున్నారు.

వృద్ధులతో జాగ్రత్త:
వృద్ధులు, బీపీ, షుగర్ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్పించి వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వీరి పట్ల అనుసరించాల్సిన వైద్య విధానాలు, ప్రక్రియలను కింది స్థాయి వైద్య సిబ్బందివరకూ చేరవేయాలన్నారు. ఉత్తమమైన, నాణ్యమైన వైద్యం అందేలా చూడాలన్నారు. నమోదవుతున్న కేసులు, వ్యాప్తి చెందడానికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సీఎం చెప్పారు. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

సామాజిక దూరం మస్ట్:
రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్, మార్కింగ్స్‌ తప్పనిసరిగా ఉండాల్సిందేనన్న సీఎం ఎక్కడా జనం గమిగూడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులతో చెప్పారు. ఏపీలో ఇప్పటివరకు 417 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌ కేసులు 13. వారిద్వారా సోకిన కేసులు సంఖ్య 12. ఢిల్లీ వెళ్లిన వారిలో పాజిటివ్‌ కేసులు 199. వారి ద్వారా సోకిన వారు 161మంది. మిగిలిన పాజిటివ్‌ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వల్ల, వ్యాధి సోకిన వారు, వారి ద్వారా, ఇతరత్రా మార్గాల వల్ల కరోనా సోకిన వారు 32మంది ఉన్నారు.