వెల్దుర్తి మృతులకు ఒకే చోట అంత్యక్రియలు

  • Published By: veegamteam ,Published On : May 12, 2019 / 10:05 AM IST
వెల్దుర్తి మృతులకు ఒకే చోట అంత్యక్రియలు

వెల్దుర్తి మృతులకు ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్ రోడ్ దగ్గర శనివారం (మే 11, 2019)న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులందరూ జోగులాంబ గద్వాల జిల్లా రామాపురం వాసులు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ కుటుంబీకులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

15 మంది మృతదేహాలను ఒకే చోట ఖననం చేశారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల పిల్లల చదువులకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
 
ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తుఫాన్ వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గుంతకల్లుకు పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.