రామప్ప ఆలయానికి ప్రపంచ గుర్తింపు !

ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా మారనుంది.

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 04:58 AM IST
రామప్ప ఆలయానికి ప్రపంచ గుర్తింపు !

ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా మారనుంది.

ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రపంచ గుర్తింపు రానుంది. ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా మారనుంది. అంతర్జాతీయ నిర్మిత ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కార్యాచరణ వేగంగా అమలు జరుగుతోంది. కాకతీయుల కాలం నాటి అత్యంత రమణీయ శిల్పకళా వైభవానికి త్వరలోనే ప్రపంచ గుర్తింపు రానుంది. 

రూ.5 కోట్లతో అత్యంత ఆధునికమైన, నాటి శిల్పకళా వైభవాన్ని చాటే విధంగా ఆడిటోరియం, సీఎస్‌ఆర్‌ నిధులతో రెండు స్వాగత తోరణాలు.. ఒకటి ప్రధాన రహదారి దగ్గర, మరొకటి రామప్ప గుడి ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర నిర్మిస్తున్నారు. రామప్ప గుడి పక్కనే ఉన్న చెరువు మధ్యలో ఉన్న ఐ ల్యాండ్‌లో భారీ శివలింగం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు నమూనాలను కూడా సిద్ధం చేశారు. అలాగే రామప్పలోని 10 ఎకరాల స్థలంలో ఒక శిల్ప కళావేదిక, శిల్పుల కోసం, శిల్ప కళా అధ్యయనం కోసం ఒక కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. 

కాగా యునెస్కోకి నామినేషన్‌ ప్రక్రియ కూడా పూర్తి అయింది. సెప్టెంబర్‌ 26, 27వ తేదీల్లో యునెస్కో బృందం రామప్పలో పర్యటించింది. యునెస్కో నుంచి వచ్చిన మన ప్రతినిధి బృందానికి పిలుపు రాగా, (నవంబర్ 22, 2019) పారిస్‌ లో యునెస్కో బృందంతో సమావేశం జరుగనుంది. రామప్ప ఆలయం అభివృద్ధిపై సోమవారం (నవంబర్ 11, 2019) ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, ములుగు జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్, కలెక్టర్‌ నారాయణరెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించారు.