గోదావరి-కృష్ణా అనుసంధానం : రూ.60వేల కోట్లతో రిజర్వాయర్ నిర్మాణం

సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాల్లో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునే దిశగా జగన్ సర్కార్ కీలక నిర్ణయo దిశగా అడుగులు వేస్తోంది. కృష్ణా-గోదావరి నదుల

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 03:57 AM IST
గోదావరి-కృష్ణా అనుసంధానం : రూ.60వేల కోట్లతో రిజర్వాయర్ నిర్మాణం

సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాల్లో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునే దిశగా జగన్ సర్కార్ కీలక నిర్ణయo దిశగా అడుగులు వేస్తోంది. కృష్ణా-గోదావరి నదుల

సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాల్లో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునే దిశగా జగన్ సర్కార్ కీలక నిర్ణయo దిశగా అడుగులు వేస్తోంది. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంలో భాగంగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల నీటి నిలువ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించేందుకు ప్రణాళిక రచిస్తోంది. రూ.60 వేల కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్న జగన్.. దానికి సంబంధిచి డీపీఆర్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు.

సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని సధ్వినియోగం చేసే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. తాజా ప్రతిపాదనను పరిశీలిస్తోంది. పోలవరం నుంచి గోదావరి జలాలను బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌కు తరలించేందుకు ఉన్న అవకాశాలపై పూర్తి నివేదికను రెడీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గోదావరి ద్వారా సముద్రంలోకి రోజుకు 23వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతోంది. రోజుకు 2 టీఎంసీల నీటిని, మొత్తంగా 210 టీఎంసీల నీటని తరలించాలన్నది జగన్ సర్కార్ ఆలోచన.

దీనివల్ల నాగార్జున సాగర్‌ కుడికాల్వ ఆయకట్టులోని 9.61 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని, నాగార్జున సాగర్‌ రెండో దశలో భాగంగా ప్రకాశం జిల్లాలోని దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో మరో 2 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాలని భావిస్తోంది. అలాగే… గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను ఈప్రాజెక్టు ద్వారా తీర్చాలన్నది ఆలోచన. మరోవైపు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇటు పులిచింతల, అటు నాగార్జున సాగర్ మీద ఆధారపడ్డ ప్రాంతాలకు బొల్లాపల్లి బాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోని నీరు ప్రాణాధారంలా నిలుస్తుందని భావిస్తున్నారు.  

గత పదిహేనేళ్లుగా… గోదావరి నదిలో నీటి ప్రవాహాన్ని ప్రామాణికంగా తీసుకుని 105 రోజుల్లో..  రోజుకు 1200 క్యూమోక్స్‌ అంటే 3.7 టీఎంసీల ప్రవాహం ఉంటుందని అంచనా వేసింది. ఇలా వచ్చే నీటిలో గోదావరి డెల్టా అవసరాలపోను, మిగిలిన నీరు సముద్రంలోకి పోతోంది. ఇలా సముద్రంలో కలిసిపోతున్న జలాలను కరువు, నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించడం ద్వారా భారీ మేలు చేకూరుతుందని ప్రభుత్వం అంచనా. ప్రస్తుతం నిర్మాణంలోఉన్న వెలిగొండతోపాటు.. కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్ట్, ఎస్సార్‌బీసీ అవసరాల కోసం బనకచర్ల రెగ్యులేటర్‌ ద్వారా నీరందించే అవకాశం ఉంటుంది. పోలవరం కుడికాల్వ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి, అక్కడ నుంచి నాగార్జునసాగర్‌ కుడికాల్వకు ఎత్తిపోస్తారు.

అక్కడి నుంచి బొల్లాపల్లిలో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు నీటిని లిఫ్ట్‌ చేస్తారు. బొల్లాపల్లి నుంచి వెలిగొండ రిజర్వాయర్‌కు నీటిని అందిస్తూ, మరోవైపున నల్లమల అడవుల్లో ఒక టన్నెల్‌ను తవ్వడం ద్వారా బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌కు తరలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో 460 కిలోమీటర్ల మేర నీటిని గ్రావిటీ ద్వారా, మరికొన్ని చోట్ల ఎత్తిపోతల ద్వారా తరలిస్తారు. సముద్రమట్టానికి 37 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు ఉంటే.. 260 మీటర్ల ఎత్తులో బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ ఉంది. అంటే 230 మీటర్ల ఎత్తుకు వివిధ దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. మొత్తంగా దీని కోసం 2100 మెగావాట్ల కరెంటు అవసరం అవుతుంది. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రతిపాదిత ప్రాజెక్టు విలువ 60వేల కోట్లపైనే ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జలవనరులశాఖ సమీక్షా సమావేశంలో సీఎం జగన్ అధికారులతో ఈ ప్రాజెక్ట్ పై చర్చించారు. దానికి సంబంధించి డీపీఆర్‌ రెడీ చేయాలని ఆదేశించారు.