డాక్టర్లకు ఏమైంది : కడుపులో బట్ట పెట్టి కుట్లేశారు

  • Published By: madhu ,Published On : February 13, 2019 / 07:49 AM IST
డాక్టర్లకు ఏమైంది : కడుపులో బట్ట పెట్టి కుట్లేశారు

తూర్పుగోదావరి : ఈ డాక్టర్లకు ఏమైంది ? వీరి నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆపరేషన్ చేసే సమయంలో తాము ఏమి చేస్తున్నామో..కొంతమందికి డాక్టర్స్‌కి అర్థం కావడం లేనట్టుంది. కడుపులో ఏవో పెట్టేసి కుట్లు వేసి పొండి అంటున్నారు. తీరా కొన్ని అనారోగ్య కారాణలతో తిరిగి ఆసుపత్రికి వస్తే తాము చేసిన పనికి నాలుక కరచుకుని తిరిగి ఆపరేషన్‌లు చేస్తున్నారు. ఇటీవలే కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేసిన నిమ్స్ వైద్యులు చేసిన నిర్వాకం మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఈ నర్సు కత్తెర మాత్రం పెట్టలేదు కానీ…ఓ బట్టను కడుపులో ఉంచేసింది. 

తూర్పుగోదావరి జిల్లాలో గవర్నమెంట్ ఆసుపత్రికి ఓ గర్బిణీ వచ్చింది. ఈ ఆసుపత్రిలోనే డెలివరీ అయ్యింది. ఏలేశ్వరం ఆసుపత్రి స్టాప్ నర్సు శాంతకుమారి డెలివరీ చేసింది. ఇంటికి వెళ్లిన ఆమె తీవ్ర కడుపునొప్పితో బాధ పడింది. తిరిగి హాస్పిటల్‌కి రాగా..కడుపులో బట్టను ఉంచేసి శాంతికుమారి కుట్లు వేసేసింది. డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో నర్సు ఈ విధంగా చేసిందని బాధితురాలు పేర్కొంటోంది. ఈ ఘటనపై విచారణ చేయించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరి ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెయిట్ అండ్ సీ…