ఇక..విమానాశ్రయాలు నడపలేం..ప్రైవేటీకరణే : కేంద్రమంత్రి

  • Published By: nagamani ,Published On : August 31, 2020 / 03:35 PM IST
ఇక..విమానాశ్రయాలు నడపలేం..ప్రైవేటీకరణే : కేంద్రమంత్రి

ఇండియాలోని విమానాశ్రయాలను, విమానయాన సంస్థలను కేంద్ర ప్రభుత్వం నడిపించే పరిస్థితి లేదని..కాబట్టి ప్రైవేటీకరణ తప్పదని పౌరవిమానయాన మంత్రి హర్ దీప్ సింగ్ పురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఈ సంవత్సరం లోనే పూర్తవుతుందని ఆయన అన్నారు.



ఇటీవల సమావేశమైన కేంద్ర క్యాబినెట్..కేరళలోని తిరువనంతపురం ఎయిర్ పోర్టును అదానీ ఎంటర్ ప్రైజస్ కు అప్పగించడాన్ని కేరళ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో హర్ దీప్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనించాల్సిన విషయం. అంతేకాదు..దేశంలోని విమానాశ్రయాల నిర్వహణలో పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్) విధానానికి పెద్దపీట వేస్తామని కూడా ఆయన తెలిపారు.

నమో యాప్ ద్వారా జరిగిన ఓ వర్చ్యువల్ మీట్ లో మాట్లాడిన మంత్రి..ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం విమానాశ్రయాలను నడిపించే పరిస్థితి లేదనీ అలాగే విమానయాన సంస్థలను కూడా నడిపించ పరిస్థితి లేదని అన్నారు. ప్రస్తుతం పౌరవిమానయాన శాఖ ఆధ్వర్యంలోని ఏఏఐ (ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా) అధీనంలో దాదాపు 100కు పైగా విమానాశ్రయాలు ఉన్నాయి. వీటన్నింటినీ దశలవారీగా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్నది కేంద్ర అభిమతంగా ఉంది.



ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియపై మంత్రి మాట్లాడుతూ..ప్రైవేటీకరణ కోసం సమర్ధతగల కంపెనీల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నామని..కుదిరితే ఈ సంవత్సరమే ప్రైవేటీకరణ అయిపోవచ్చనీ..సమర్ధతగల కంపెనీల నుంచి డీల్ కుదురుతుందని నేను ఆశిస్తున్నానని అన్నారు.
https://10tv.in/rafale-fighter-jets-to-be-formally-inducted-into-iaf-on-september-10-french-defence-minister-invited/
కాగా..గత మంగళవారం (ఆగస్టు 25,2020) సమావేశమైన కేంద్ర క్యాబినెట్..ఎయిర్ ఇండియాను అక్టోబర్ 30 నాటికి విక్రయించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. నిజం చెప్పాలంటే ఇప్పటికే ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావాల్సి వుంది. కానీ… కేంద్రం జనవరి 27న బిడ్లకు తుది గడువు పెట్టింది. కారణం సమర్థతగల కంపెనీల నుంచి డీల్ రాకపోవటమేనని సమాచారం. దీంత నాలుగు సార్లు తుది గడువును పొడిగిస్తూ వచ్చింది.



కరోనా ప్రభావంతో ఇప్పటికే అన్ని రంగాలతో పాటు విమానయాన సంస్థలకు కూడా ఈ ఆర్థిక సంక్షోభం తప్పలేదు. దీంతో ఈ సంవత్సరం చివరికైనా దేశవాళీ విమాన ప్రయాణికుల సంఖ్య..పెరుగుతుందని కేంద్రం ఆశిస్తున్నామని హర్ దీప్ సింగ్ అంచనా వేశారు. ప్రస్తుతం విమానాల కెపాసిటీలో 45 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే అధికారులు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇండియాలోని మేజర్ ఎయిర్ పోర్టులైన లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, గౌహతి, తిరువనంతపురం విమానాశ్రయాలను అదానీ ఎంటర్ ప్రైజస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

అహ్మదాబాద్, మంగళూరు, లక్నో అనే మూడు విమానాశ్రయాలను అదానీ ఎంటర్ప్రైజెస్‌కు లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు 2019 జూలైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.



ఆగస్టు ప్రారంభంలో , తిరువనంతపురం విమానాశ్రయాన్ని కంపెనీకి లీజుకు ఇవ్వాలన్న ఆగస్టు 19 కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు . ఈ నిర్ణయాన్ని పున:పరిశీలించాల్సి అవసరం ఉందని విజయన్ లేఖలో పేర్కొన్నారు. అయినా సరే కేంద్రం అనుకున్నదే చేస్తోంది. అదే మాట మంత్రి స్పష్టం చేస్తున్నారు.