ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం : ప్రభుత్వం భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారు? 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని తప్పుపట్టింది.

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 08:19 AM IST
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం : ప్రభుత్వం భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారు? 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని తప్పుపట్టింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని తప్పుపట్టింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ప్రభుత్వం భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారని ప్రశ్రించింది. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. 

ప్రభుత్వ భవనాలకు పార్టీల రంగులు వేయడం సరికాదు.. ఆ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ప్రభుత్వ భవనాలకు గతంలో కూడా రంగులు వేశారని ప్రభుత్వ తరపు లాయర్ ప్రస్తావించగా.. ఎవరైనా సరే ప్రభుత్వ భవనాలకు రంగులు వేయొద్దని కోర్టు సీరియస్‌గా స్పందించింది. పల్లపాడు పంచాయతీకి పార్టీ రంగులు వేయడంపై కలెక్టర్ పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పది రోజుల నివేదిక వచ్చాక పూర్తిస్థాయి విచారణ జరిపి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు తెలిపింది.

పంచాయతీ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వేయడంపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ సొమ్ముతో పార్టీ రంగులు వేయడం ఏంటని ప్రశ్నించారు. ఫోటోలు, వీడియోలను కోర్టుకు అందించారు. కలెక్టర్ కోర్టుకు నివేదిక ఇచ్చిన తర్వాత ఈ పిటిషన్ పై విచారణ జరుగనుంది. మరి హైకోర్టు రంగుల వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.