ప్రేమపెళ్లి చేసుకున్న కూతురు..మనుమరాలిని అమ్మేసిన అమ్మమ్మ

  • Published By: nagamani ,Published On : August 29, 2020 / 03:36 PM IST
ప్రేమపెళ్లి చేసుకున్న కూతురు..మనుమరాలిని అమ్మేసిన అమ్మమ్మ

పసిబిడ్డల్ని సంతలో కూరగాయలు అమ్మినట్లుగా అమ్మేస్తున్నారు. బేరాలు ఆడి మరీ అమ్మేస్తున్నారు.కన్నపేగులు బజారులో అమ్మకానికి పెట్టిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో..అటువంటిదే ఓ అమ్మమ్మ తన సొంత కూతురుకు పుట్టిన బిడ్డను అమ్మేసింది. అప్పులు తీర్చటానికి పసిబిడ్డను అమ్మేసింది. బిడ్డకోసం తల్లడిల్లుతున్న కన్నకూతుర్ని చూసి కూడా జాలి కలగలేదు ఆ కసాయి తల్లికి. తాను కూడా తల్లే అనే సంగతి మరిచిపో కాసుల కోసం కూతుర్ని బిడ్డను రూ.1.10 లక్షలకు అమ్మేసింది.



వివారాల్లోకి వెళితే..కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన జమల్పూరి పద్మ రమేశ్ అనే యువకుడ్ని ప్రేమించింది. దీనికి పెద్దలు అంగీకరించకపోవటంతో రమేశ్ ను పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరూ హైదరాబాద్‌ కాపురం పెట్టారు. నాలుగేళ్లు గడిచాయి. వారికి ఓ నెల క్రితం ఓ ఆడబిడ్డ పుట్టింది. ఈక్రమంలో పద్మకు రమేశ్ కు మధ్య గొడవలు వచ్చాయి. దీంతో పద్మ వారం క్రితం పద్మ భర్త రమేశ్ తో గొడవ పడి స్వగ్రామంలోని తల్లి కనకమ్మ ఇంటికి వచ్చింది.

అప్పటికే కూతురి ప్రేమ వివాహం నచ్చని కనకమ్మకు కూతురిపై కోపం నాలుగేళ్లైనా తగ్గలేదు. కానీ తన కూతురు తిరిగి తన దగ్గరకు వచ్చేసరికి లేని ప్రేమను నటించింది. మాయమాటలు చెప్పింది. ఇంకెప్పుడు నీ మొగుడి దగ్గరకు వెళ్లవద్దని నిన్ను నేనే బాగా చూసుకుంటానని చెప్పింది. కానీ అవేవీ పద్మ పట్టించుకోలేదు. కానీ భర్తపై కోపంతో తల్లిదగ్గరకు వచ్చింది కానీ భర్త తనకోసం తన బిడ్డ కోసం వస్తాడని ఎదురు చూస్తోంది. పద్మ ఇలా ఉంటే పద్మ తల్లి కాంతమ్మ మాత్రం తాను కూడా ఓ తల్లే అనే సంగతి మరచిపోయింది.



కసాయిగా మారి..నాలుగు రోజుల క్రితం నెల రోజుల పసిగుడ్డును పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి రూ.1.10 లక్షలకు అమ్మేసింది. తన బిడ్డ కనిపించకపోవటంతో పద్మ తల్లిని నిలదీయగా మాయమాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. పద్మ గట్టిగా నిలదీయడంతో.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఈ గొడవ విన్న ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయటంతో వారు వచ్చి కనకమ్మను గట్టిగా నిలదీసేసరికి అసలు విషయం ఒప్పుకుంది. అమ్మేశానని చెప్పడంతో పద్మ గుండెలు బాదుకుని రోదించింది. నువ్వసలు మనిషివేనా..అసలు ఆడదానివేనా? అని ఆవేశంగా ఆవేదనగా ఏడుస్తూ అడిగేసరికి..నాకు చాలా అప్పులున్నాయి..వాటిని తీర్చే పరిస్థితి నాకు లేదు…అందుకే అమ్మేశానని చెప్పింది..



శిశువు విక్రయంపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఎదుట హాజరు పర్చేందుకు కరీంనగర్‌లోని శిశువిహార్‌కు తరలించారు. మరోవైపు శిశువు విక్రయంలో కొందరు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు తెలిసింది. కనకమ్మ రూ.2 లక్షలు డిమాండ్‌ చేయగా రూ.1.10 లక్షలకు బేరం కుదిర్చుకుని అమ్మేసినట్లుగా పోలీసులు విచారణలో తేలింది.

కాగా..పద్మకు గతంలోనే పెళ్లి అయింది. ఆమెకు ఇదివరకే ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. మటన్ వ్యాపారం చేసే రమేశ్‌ను రెండో పెళ్లి చేసుకోవటం..పైగా కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో తల్లి కనకమ్మకు నచ్చలేదు. కూతురుపై కక్ష పెంచుకుంది. ఈ క్రమంలో భార్యాభర్తల నడుమ గొడవ జరగడంతో.. అదే తనకు అనుకూలంగా మార్చుకుని కనకమ్మ.. కూతురును తన ఇంటికి తీసుకొచ్చి శిశువును విక్రయించిందని పోలీసులు వెల్లడించారు.



girl 1.10 lakh grand daughter in telanganas