రేట్లు పెంచేశారు.. ఏసీ వెయ్యలేదు.. మహర్షి థియేటర్లో ఆందోళన

  • Published By: vamsi ,Published On : May 11, 2019 / 12:01 PM IST
రేట్లు పెంచేశారు.. ఏసీ వెయ్యలేదు.. మహర్షి థియేటర్లో ఆందోళన

మహర్షి సినిమా చూసేందుకు వచ్చిన సినిమా ప్రేక్షకులకు చేదు అనుభవం ఎదురైంది. కర్నూల్ నగరంలోని ఆనంద్ సినీ కాంప్లెక్స్‌లో ఎక్కువ రేట్లు తీసుకుని సౌకర్యాలు మాత్రం మినిమం కూడా లేకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రేక్షకులు ఆందోళన చేశారు. థియేటర్‌లో సినిమా వస్తున్న సమయంలో ఏ/సీ వెయ్యకుండా యాజమాన్యం ఇబ్బంది పెట్టడంతో కొందరు మధ్యలో నుంచి వెళ్లిపోయారని, కొందరు ప్రేక్షకులు చమటల మధ్యే ఇబ్బంది పడుతూ సినిమాను చూశారని వెల్లడించారు.

షో అయిపోయినా బయటకు రాకుండా అక్కడే కూర్చొని నిరసన తెలిపిన ప్రేక్షకులు.. సినిమా చూస్తున్న సమయంలో ఏసీ ఆన్ చేయని థియేటర్ యాజమాన్యంపై మండిపడ్డారు. ప్రేక్షకులు ఎంత చెప్పినా పట్టించుకోని యాజమాన్యం ప్రేక్షకులపైన రివర్స్ అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ మేనేజర్.. ఏం చేయమూ.. ఏం చేస్తారో చేసుకోండి అన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏసీ ఉంది అనే ఎక్కువ డబ్బులు ఎక్కువ పెట్టి వచ్చామని కానీ జనాల ఇబ్బందులు పట్టించుకోకుండా యాజమాన్యం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుందని అన్నారు. కాగా ఆందోళన చేయడంతో వచ్చిన పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి ధర్యాప్తు చేపట్టినట్తు తెలిపారు. పార్కింగ్, ఎమ్ఆర్‌పీ రేట్లు కూడా నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్నట్లు ప్రేక్షకులు పోలీసులకు కంప్లైంట్ చేశారు.