ఫేస్ మాస్క్ పై మత్తు మందు చల్లి మైనర్ బాలికపై అత్యాచారం

  • Published By: murthy ,Published On : September 7, 2020 / 04:54 PM IST
ఫేస్ మాస్క్ పై మత్తు మందు చల్లి మైనర్ బాలికపై అత్యాచారం

కరోనా రక్షణ కోసం ధరించే ఫేస్ మాస్క్ పై మత్తు మందుచల్లి……మైనర్ బాలిక మానం దోచేసిన కాంట్రాక్టర్ ఉదంతం పంజాబ్ లో వెలుగు చూసింది. జిరాక్ పూర్ పట్టణంలో వివిధ పనులకు లేబర్ ను సమకూర్చే కాంట్రాక్టర్ సంత్ రాజ్ యాదవ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధిత మైనర్  బాలిక  కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు  కేసు నమోదు చేశారు.



బాలిక చెప్పిన వివరాల ప్రకారం…. ఆగస్ట్ 29 శనివారం నాడు కాంట్రాక్టర్ సంత్ రాజ్ యాదవ్ కొంత మంది పని వారి కోసం బాలిక ఉండే కాలనీకి వచ్చాడు. కొందరికి పని పురమాయించి,   బాధిత బాలిక ఇంటికి వచ్చి పని ఉంది రమ్మని అడిగాడు.

ఆమెకు పని అవసరం ఉండటంతో సంత్ రాజ్ వెంట వెళ్లింది. ఆమెను ఒక పని చేయాల్సిన  ప్రదేశానికి తీసుకువెళ్లాడు. మైనర్ బాలిక ధరించటానికి ఫేస్ మాస్క్ ఇచ్చాడు. బాలికపై కన్నేసిన సంత్ రాజ్ ఆ ఫేస్ మాస్క్ పై మత్తు మందు స్ప్రే చేశాడు. ఆ విషయం ఆమెకు తెలియదు.



కోవిడ్-19 రక్షణ చర్యల్లో భాగంగా మాస్క్ తప్పనిసరి కనుక బాలిక మాస్క్ ధరించింది. మాస్క్ ధరించిన కొద్దిసేపటికి మైనర్ బాలిక స్పృహ తప్పి పోయింది. ఆమెకు మెలుకువ వచ్చి చూసుకోగా….తానోక మంచంమీద పడుకుని ఉన్నానని… తన పక్కన సంత్ రాజ్ ఉన్నాడని తాను మానభంగానికి గురైనట్లు తెలుసుకుంది. వెంటనే తేరుకుని సంత్ రాజ్ ని ప్రశ్నించగా… ఈవిషయం ఎవరికైనా చెపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడని తెలిపింది.
https://10tv.in/mandapeta-police-arrest-2-men-for-murder-plot/
ఇంటికి వెళ్లిన తర్వాత… సంత్ రాజ్ మత్తు మందు చల్లిన ఫేస్ మాస్క్ ఇచ్చితనపై అత్యాచారం చేసిన విషయాన్ని తల్లికి, అక్కకి చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంత్ రాజ్ పై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం) మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్నసంత్ రాజ్ ను పట్టుకోటానికి పోలీసులు గాలిస్తున్నారు.