అఖిల ప్రియ కోపం : సెక్యూరిటీ లేకుండానే పర్యటన

  • Published By: madhu ,Published On : January 6, 2019 / 07:12 AM IST
అఖిల ప్రియ కోపం : సెక్యూరిటీ లేకుండానే పర్యటన

కర్నూలు : ఏపీ మంత్రి అఖిల ప్రియ కోపం ఇంకా చల్లారడం లేదు. ఆమె ఆళ్లగడ్డ పోలీసులపై గుర్రుగా ఉన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అఖిల ప్రియ వెళుతుండడంపై ఆమె అభిమానులు..టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆళ్లగడ్డ పోలీసుల వ్యవహార తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు అఖిల ప్రియ కోపానికి కారణం ఏంటీ ? 
కార్చన్ సెర్చ్ పేరిట తమ పార్టీకి చెందిన కార్యకర్తల నివాసాల్లో సోదాలు నిర్వహిస్తూ వారిని వేధిస్తున్నారని అఖిల ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు..నేతలను పోలీసులు టార్గెట్ చేశారని..ఏదైనా తప్పు చేసి ఉంటే తాను చెబుతానని మంత్రి పేర్కొంటున్నారు. అందులో భాగంగా తనకు సెక్యూర్టీ‌ అవసరం లేదని…పోలీసులను వెనక్కి పంపించేస్తున్నారు. గత మూడు రోజులుగా జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఆమె నక్సల్ ప్రభావిత ఏరియాలకు వెళుతున్నారు. అక్కడ ప్రజల ఇబ్బందులు..ప్రభుత్వ పథకాలపై ఆరా తీస్తున్నారు. కానీ 
ఆమె ఎలాంటి భద్రత లేకుండా తిరుగుతుండడంతో టీడీపీ శిబిరంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే…తమ విధుల్లో భాగంగానే తాము కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతోందని ఆళ్లగడ్డ పోలీసులు పేర్కొంటున్నారు. మరి అఖిల వర్సెస్ ఆళ్లగడ్డ పోలీసులకు మధ్య ఉన్న ఈ వివాదం సద్దుమణుగుతుందా ? లేదా ? అనేది చూడాలి.