మతం మారాల్సి వస్తే ముందు లోకేశ్ మారాలి : మంత్రి కన్నబాబు

  • Published By: veegamteam ,Published On : November 23, 2019 / 10:26 AM IST
మతం మారాల్సి వస్తే ముందు లోకేశ్ మారాలి : మంత్రి కన్నబాబు

మత మార్పిడి కోసమే ప్రభుత్వ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారంటూ చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారనీ…ఇంగ్లీష్ చదివిన వారు మతం మారాల్సి వస్తే ముందుగా మతం మారాల్సింది లోకేశ్ అని మంత్రి కన్నబాబు అన్నారు.

ఏపీలో గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య  మాటల యుద్ధాలు కొనసాగుతున్న క్రమంలో మంత్రి కన్నబాబు మరోసారి విపక్ష నేతలపై ఫైర్ అయ్యారు. మత మార్పిడి పెంచటం కోసం వైసీపీ ప్రభుత్వం స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టాలనుకుంటోందంటూ విపక్ష నేతల అసత్య ప్రచారం చేస్తున్నారనీ..అర్థం పర్థం లేని విమర్శలతోను..అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అది పూర్తిగా అవాస్తవమని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.

ఇసుక…ఇంగ్లీష్ మీడియం అంటూ చంద్రబాబు  రాద్ధాంతం చేస్తున్నారనీ మంత్రి మండి పడ్డారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యుల్లో తెలుగు మీడియం చదివిన ఒక్కరి పేరు చెప్పండి అంటూ మంత్రి కన్నబాబు అన్నారు. మీరు..మీ పిల్లలు..మీ వారసులు అంతా ఇంగ్లీష్ మీడియాల్లో చదివి కొత్తగా తెలుగుపై ప్రేమ ఉన్నట్లు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ఏదో ఘోరం జరిగిపోతున్నట్లుగా మాట్లాడుతున్నారనీ..ఇది సరైంది కాదని కన్నబాబు అన్నారు.