జగన్ హామీ : లోకేష్‌పై ఆర్కేని గెలిపిస్తే మంత్రి పదవి

మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)ని గెలిపిస్తే తన కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తానని వైసీపీ చీఫ్ జగన్ హామీ ఇచ్చారు.

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 06:13 AM IST
జగన్ హామీ : లోకేష్‌పై ఆర్కేని గెలిపిస్తే మంత్రి పదవి

మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)ని గెలిపిస్తే తన కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తానని వైసీపీ చీఫ్ జగన్ హామీ ఇచ్చారు.

గుంటూరు : మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)ని గెలిపిస్తే తన కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తానని వైసీపీ చీఫ్ జగన్ హామీ ఇచ్చారు. ఆర్కేని గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటారని జగన్ చెప్పారు. ఆర్కేని గెలిపిస్తే మీ ఆస్తులను కాపాడతాడు, మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు అని తెలిపారు. మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్ ను చిత్తుగా ఓడించాలని జగన్ పిలుపునిచ్చారు.
Read Also : సర్వేలు అనుకూలం: ఓటమి భయంతో వైసీపీ బెంబేలు

మంగళగిరిలో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్.. మంగళగిరిలో ఒక్కసారి కూడా కాలు పెట్టలేదని జగన్ విమర్శించారు. లోకేష్ గెలిస్తే మంగళగిరి నియోజకవర్గంలో రైతులకు వారి భూములకు రక్షణ ఉండదన్నారు. భూములు బలవంతంగా లాక్కుంటున్నారని జగన్ ఆరోపించారు. కుప్పంలో చంద్రబాబుని ఓడించాలని నిర్ణయించుకున్నట్టే మంగళగిరిలో లోకేష్ ను ఓడించాలని జగన్ అభ్యర్థించారు.

లోకేష్ ఏనాడు కూడా మంగళగిరిలో కాలు పెట్టలేదని, తిరగలేదని, సమస్యలను పట్టించుకోలేదని జగన్ అన్నారు. అలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దన్నారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికుట్రలు చేసినా, మోసాలు చేసినా.. ఓడిపోవడం ఖాయం అని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు మోసపూరిత పాలనకు చరమగీతం పాడాలని జగన్ కోరారు. తనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని అభ్యర్థించారు. మంచి పాలన అందిస్తానని, ప్రజలకు అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. తన తండ్రి వైఎస్ అందించిన పాలన కన్నా గొప్పపాలన అందిస్తానని జగన్ మాటిచ్చారు. 
Read Also : జగన్ వైసీపీని బీజేపీలో కలిపేస్తారు: నారా రోహిత్