ముసలివారే వారి టార్గెట్టా : వృద్ధుడి దారుణ హత్య 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఘనపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఇద్దరు వృద్ధులపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు.

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 05:24 AM IST
ముసలివారే వారి టార్గెట్టా : వృద్ధుడి దారుణ హత్య 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఘనపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఇద్దరు వృద్ధులపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఘనపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఇద్దరు వృద్ధులపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు. గొంతు నులిమి చంపేందుకు యత్నించారు. ఒకే గ్రామంలో రెండు వేరు వేరు ప్రాంతాలలో ఇద్దరు వృద్ధులపై దుండగులు దాడికి పాల్పడ్డారు.
Read Also : కేరళ టూర్ : ఆలయాల్లో రాహుల్ సాష్టాంగ నమస్కారాలు

ఈ దాడిలో సమ్మయ్య అనే 80 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందగా..బొల్లి రాజమ్మ అనే మరొక వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికులు వద్ద ఈ ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. 

వేసవి కాలం కావాటంతో ఆరు బయట పడుతున్న సమ్మయ్య అనే వృద్ధుడి దాడికి పాల్పడిన దుండగాలు దారుణంగా హత్య చేశారు. గొంతు నులిమి..మర్మాంగాన్నీ కోసి అతి కిరాతంగా హత్య చేశారు. ఈ దారుణానికి పాల్పడిన కొద్ది సేపటికే అదే గ్రామానికి చెందిన రాజమ్మ అనే 70 సంవత్సరాల వృద్ధురాలిపై కూడా దాడికి పాల్పడ్డారు.

ఇంటిలోనే పడుకున్న రాజమ్మపై దాడిచేసేందుకు ఇంటి పైకప్పు తొలగించి లోపలికి  దిగి ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె అపస్మార స్థితిలోకి వెళ్లిపోవటంతో చనిపోయిందని భావించిన దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఈ రెండు ఘటనలో చెల్పూరు గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. 
Read Also : ఓటుకి నోటు : ఒక్కొక్కరికీ రూ.300.. కోటిన్నర పట్టివేత