పెళ్లి పందిట్లో ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్..గొంతు కోసి దారుణ హత్య

  • Published By: veegamteam ,Published On : November 8, 2019 / 05:21 AM IST
పెళ్లి పందిట్లో ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్..గొంతు కోసి దారుణ హత్య

చిత్తూరు జిల్లా  కురబలకోట మండలం చేనేత నగర్‌లో దారుణం జరిగింది. గురువారం (నవంబర్ 7) ఐదేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చి శుక్రవారం ఉదయానికి కల్లా పెళ్లి ఇంటి ముందు పడేసి పోయారు. ఈ దారుణ ఘటనలో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. 

వివరాల్లోకి వెళితే..చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్‌లో బంధువుల ఇంటిలో పెళ్లికి తల్లిదండ్రులతో కలిసి ఐదు సంవత్సరాల చిన్నారి వర్షిణి వచ్చింది. అలా పెళ్లికి వచ్చిన వర్షిణి ఆడుకుంటుండగా..దుండగులు అపహరించుకుపోయారు.. దీంతో చిన్నారి కనిపించకపోవటంతో చుట్టు పక్కల అంతా వెదికారు. అయినా వర్షణి కనిపించపోవటంతో భయాందోళనలకు గురైన తల్లిదండ్రులు బంధువుల సహాయంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గొంతు కోసి హత్య చేశారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ శుక్రవారం ఉదయానికల్లా ఫంక్షన్ హాల్ వద్ద వర్షిణి మృతదేహం పడి ఉంది. దీంతో వర్షిణి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వర్షిణి స్వస్థలం బి.కొత్తకోట మండలం గుట్టపాలెం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.