తెలుగుదేశం శ్రేణులకు చంద్రబాబు పిలుపు

  • Published By: vamsi ,Published On : May 3, 2019 / 02:20 AM IST
తెలుగుదేశం శ్రేణులకు చంద్రబాబు పిలుపు

తెలుగుదేశం శ్రేణులు, ‘ఫోని’ తుఫాను బాధితులకు అండగా నిలవాలని, ‘ఫోని’ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సాహాయ చర్యలకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయంలో ఉన్న చంద్రబాబు.. ఫోని తుఫాను బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చంద్రబాబు అన్నారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలు, వాణిజ్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. తాగునీరు, పాలు, ఆహారం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలపై తుఫాను ప్రభావం ఉందని చంద్రబాబు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 130-140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు చెప్పారు.