రాజధాని రైతుల ఉద్యమానికి నారా భూవనేశ్వరి విరాళం

  • Published By: vamsi ,Published On : January 1, 2020 / 08:11 AM IST
రాజధాని రైతుల ఉద్యమానికి నారా భూవనేశ్వరి విరాళం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని గ్రామాల్లో సతీసమేతంగా పర్యటిస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపుతున్నారు.

ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎంపీ కేశినేని నాని, మాగంటి బాబు, గల్లా అరుణకుమారి, పంచుమర్తి అనురాధ, శ్రావణ్ కుమార్, వర్ల రామయ్య కూడా సభలో పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన చేతికి ఉన్న గాజులు తీసి అమరావతి ఉద్యమానికి విరాళంగా ఇచ్చారు. భువనేశ్వరి మాట్లాడుతూ… “మహిళలు పడుతున్న బాధను తోటి మహిళగా అర్థం చేసుకున్నా.

ఏపీని ప్రథమ స్థానంలోకి తీసుకురావడానికి చంద్రబాబు నిరంతర కృషి చేశారు. ప్రజల తర్వాతే.. నన్ను, కుటుంబాన్ని పట్టించుకునేవారు. ఎప్పుడూ రైతులకు పూర్తి మద్దతుగా మా కుటుంబం అండగా ఉంటుంది.” అంటూ తన చేతి గాజులు తీసి అమరావతిలో ఉద్యమిస్తున్న రైతులకు ఇచ్చారు భూవనేశ్వరి.