కార్మికులకు షాక్ :  నెల్లిమర్ల జ్యూట్ మిల్లు లాకౌట్ 

అత్యంత చారిత్రాత్మకమైన నెల్లిమర్ల జ్యూట్ మిల్లు లాకౌట్ పడింది.

  • Published By: veegamteam ,Published On : January 10, 2019 / 05:35 AM IST
కార్మికులకు షాక్ :  నెల్లిమర్ల జ్యూట్ మిల్లు లాకౌట్ 

అత్యంత చారిత్రాత్మకమైన నెల్లిమర్ల జ్యూట్ మిల్లు లాకౌట్ పడింది.

విజయనగరం : కార్మికులకు షాకింగ్ న్యూస్. జిల్లాలో అత్యంత చారిత్రాత్మకమైన నెల్లిమర్ల జ్యూట్ మిల్లు లాకౌట్ పడింది. అర్ధరాత్రి మిల్లును యాజమాన్యం లాకౌట్ చేసింది. మిల్లు ఆర్థిక నష్టాల్లో ఉన్నందున మూసివేస్తున్నట్లు నోటీసు బోర్డులో పేర్కొన్నారు. రోజులాగే ఇవాళ ఉదయం షిప్ట్ కు హాజరైన కార్మికులు గేట్ పై ఉన్న నోటీసు బోర్డును చూసి షాక్ అయ్యారు. మిల్లుకు తాళం వేసి ఉండటంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

గడిచిన రెండు రోజులుగా కార్మికులు దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు. సెలవును అవకాశంగా తీసుకుని మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిల్లు మూతపడటంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. సంక్రాంతి పండుగ ముందు మిల్లు మూతపడటంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. 1992 నుంచి కార్మికుల వేతనాల్లో సగం కట్ చేస్తూ మిల్లు నడుస్తోంది. 2 వేల మంది కార్మికులు మిల్లులో పని చేస్తున్నారు. మూడు షిఫ్టులలో విధులు నిర్వహిస్తున్నారు.