ఏపీలో కొత్త పథకం : చేనేత కుటుంబాలకు రూ.24వేలు సాయం

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. పలు అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సమావేశంలో చేనేత కుటుంబాలకు సీఎం

  • Published By: veegamteam ,Published On : October 16, 2019 / 06:50 AM IST
ఏపీలో కొత్త పథకం : చేనేత కుటుంబాలకు రూ.24వేలు సాయం

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. పలు అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సమావేశంలో చేనేత కుటుంబాలకు సీఎం

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. పలు అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సమావేశంలో చేనేత కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. ఏపీలో మరో పథకానికి శ్రీకారం చుట్టారు. అదే వైఎస్ఆర్ చేనేత నేస్తం. చేనేత కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం.. ఈ స్కీమ్ కి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.

ఈ పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24వేలు ఆర్థికా సాయంగా ఇవ్వనున్నారు. అది కూడా ఒకే విడతలో. ప్రతి ఏటా డిసెంబర్ 21న చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. బ్యాంకు అకౌంట్ లోకి ఆ మొత్తాన్ని వేస్తారు. చేనేత నేస్తం స్కీమ్ కి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం ద్వారా 90వేల చేనేత కుటుంబాలకు లబ్ధి కలగనుంది.

ఏపీ కేబినెట్ బుధవారం (అక్టోబర్ 16, 2019) సమావేశం అయ్యింది. రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన మరునాడే జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గం. రాష్ట్ర ప్రజలకు మరిన్ని వరాలు అందించేందుకు పలు పథకాలకు ఆమోదముద్ర వేయనుంది. 

ఏపీ సచివాలయంలో ఉదయం 11.30గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభమైది. నెల రోజుల విరామం తర్వాత భేటీ అయిన కేబినెట్ మీటింగ్‌లో ప్రధానంగా 15 అంశాలు చర్చకు రానున్నాయి. మరిన్ని కొత్త పథకాలకు, కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా… మహిళల ఆర్థికాభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన వెలుగు పథకాన్ని..వైఎస్సార్ క్రాంతి పథకంగా మార్చి అమలు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వనుంది. వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు పెంచిన వెయ్యి రూపాయల పెట్టుబడి సాయానికి కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది.

గత కేబినెట్‌లో చర్చకు రాని మత్స్యకారుల సంక్షేమం విషయంలోనూ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు అందిస్తున్న రూ.4వేల సాయాన్ని రూ.10వేలకు పెంచే అవకాశం ఉంది. నాయి బ్రాహ్మణులకు ఏడాదికి రూ.10వేల సాయంపైన చర్చిస్తున్నారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. వ్యవసాయ కమిషన్ సమావేశంలో మిల్లెట్, పల్సెస్, ప్యాడీ బోర్డులను ఏర్పాటు అంశం కూడా కేబినెట్‌ భేటీలో టేబుల్ అజెండాగా చర్చకు రానుంది. రాష్ట్రంలో ఇసుక కొరత క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.