గుడ్డు కూర వండలేదని రాడ్డుతో కొట్టి చంపేశాడు!!

గుడ్డు కూర వండలేదని రాడ్డుతో కొట్టి చంపేశాడు!!

డిన్నర్‌కి పిలిచి భోజనంలో egg curry పెట్టలేదని గొడవకు దిగి ఫ్రెండ్ నే హతమార్చాడు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ పోలీసులు కేస్ ఫైల్ చేసి దర్యాప్తు చేపడుతున్నారు. శనివారం తలకు గాయాలతో చచ్చిపడి ఉన్న వ్యక్తిని చూసి స్థానికులు సమాచారం అందించారు.

బాధితుడు స్నేహితుడైన గౌరవ్ గైక్వాడ్ ఇందులో భాగం అని పోలీసులు చెబుతున్నారు. డిన్నర్ కి అని శుక్రవారం ఫ్రెండ్ ను పిలిచాడు. ఆల్కహాల్ తీసుకున్న మత్తులో డిన్నర్ గుడ్డు కూర లేదని గొడవపెట్టుకుని అది పెద్దగా మారడంతో రాడ్డు తీసుకుని స్నేహితుడ్ని చంపేశాడు.



శుక్రవారం.. బనారసి అనే వ్యక్తి గైక్వాడ్ ను డిన్నర్ కోసం పిలిచాడు. రాత్రి ఆలస్యం అయ్యేంత వరకూ ఇద్దరూ బాగా ఆల్కహాల్ తీసుకున్నారు. ఆ తర్వాత తినడానికి గుడ్డు కూర వండలేదని స్నేహితుడికి చెప్పాడు. అంతే స్నేహితుడు కోపంతో రాడ్డు తీసుకుని కొట్టి చంపేశాడు.’ అని మన్కాపూర్ పోలీస్ స్టేషన్ అఫీషియల్ చెప్పారు.