వల్లభనేని వంశీపై నాన్ బెయిలబుల్ వారెంట్
గన్నవరం టీడీపీ అభ్యర్థి,సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై బుధవారం(ఏప్రిల్-3,2019) నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు ఈ వారెంట్ను జారీ చేసింది.2009లో ఆయుధాల చట్టం కింద వంశీపైకేసు నమోదైంది. తనకు గవర్నమెంట్ సెక్యూరిటీ వద్దంటూ ప్రైవేటు భద్రతను వంశీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో వంశీ దగ్గర అక్రమ ఆయుధాలు లభించాయని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే ఈ కేసు విచారణకు వంశీ హాజరుకాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
అయితే దీనిపై వంశీ స్పందిస్తూ….2013లోనే ఈ కేసును హైకోర్టు కొట్టివేసిందని.. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. హైకోర్టు తీర్పు కాపీని నాంపల్లి కోర్టుకు నివేదిస్తానని వంశీ తెలిపారు.