మనిషేనా : మంచాన పడిన వృద్ధురాలిని ఇల్లు ఖాళీ చేయించిన యజమాని

  • Published By: veegamteam ,Published On : November 20, 2019 / 12:52 PM IST
మనిషేనా : మంచాన పడిన వృద్ధురాలిని ఇల్లు ఖాళీ చేయించిన యజమాని

ప్రకాశం జిల్లా పామూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానవత్వం మంటగలిసింది. ఓ వృద్ధురాలి ఆరోగ్యం క్షీణించడంతో ఇల్లు ఖాళీ చేయమన్నాడు యజమాని. దీంతో ఓ పార్కులో టెంట్ వేసి తల్లిని ఉంచాడు కొడుకు. పామూరులోని ఓ ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి సురేశ్ అనే వ్యక్తి అద్దెకు నివసిస్తున్నాడు. సురేశ్ తల్లికి ఆరోగ్యం క్షీణించింది.

దీంతో ఆ ఇంటి యజమాని.. తల్లిని తన ఇంట్లో ఉంచొద్దని సురేశ్ ను కోరాడు. దీంతో అతను ఏం చేయలేక ఓ పార్కులో టెంట్ వేసి.. అక్కడే తన తల్లిని మంచంపై పడుకోబెట్టాడు. తనలాగా.. ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని సురేశ్ కోరుతున్నారు.