కుటుంబ గౌరవం ముందు చెల్లి ప్రాణాలు ఎక్కువేం కాదు..అందుకే కాల్చిపారేశా..

  • Published By: nagamani ,Published On : August 9, 2020 / 02:51 PM IST
కుటుంబ గౌరవం ముందు చెల్లి ప్రాణాలు ఎక్కువేం కాదు..అందుకే కాల్చిపారేశా..

కుటుంబ గౌరవం ముందు తోడబుట్టిన అక్కచెల్లెళ్లైనా..కన్నతల్లి అయినా..కట్టుకున్న భార్య అయినా సరే..వారి ప్రాణాలు లెక్క కాదు కాల్చిపారేస్తాం..ఉరితీసి చంపేస్తాం..కర్కశంగా నరికి పోగులు పెడతాం అనే విష సంస్కృతి సమాజంలో వేళ్లూనుకుపోయింది. అటువంటి హత్యలకు దేశంతో పనిలేదు. అటువంటి పరువు హత్యకు మరోసారి జరిగింది పాకిస్థాన్ లో.

ఇంటిపక్కన ఉండే యువకుడితో తన చెల్లెలు చనువుగా ఉంటోందని అన్న ఆమెను కాల్చిపారేసిన విషాద ఘటన కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో శనివారం (ఆగస్టు 8,2020) ఉదయం జరిగింది. హసమిన్ కమర్ అనే వ్యక్తి తన చెల్లెలిని తుపాకీతో పాయింట్‌ బ్లాక్ల్ లో పెట్టి కాల్చగా ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. తుపాకీ శబ్దం ఉన్న స్థానికులు పరుగు పరుగున వచ్చి చూడగా నెత్తుటి మడుగులో ఉన్న ఆమెను జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 9) చనిపోయింది.

ఈ ఘటనపై సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ సౌత్ షీరాజ్ నజీర్ మాట్లాడుతూ..నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అతన్ని విచారించగా..తన కుటుంబ గౌరవం కోసమే చంపానని అంగీకరించాడని తెలిపారు. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని విచారణలో తెలిపారు.