హాట్ హాట్‌గా పరుచూరు పొలిటిక్స్ : దగ్గుబాటి VS ఏలూరి సాంబశివరావు

  • Published By: madhu ,Published On : February 7, 2019 / 01:18 PM IST
హాట్ హాట్‌గా పరుచూరు పొలిటిక్స్ : దగ్గుబాటి VS ఏలూరి సాంబశివరావు

ప్రకాశం : ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్త నేతల్ని మచ్చిక చేసుకోవడం.. వారినే అస్త్రాలుగా మార్చుకుని ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడడం.. ఇదే ప్రస్తుతం ఆ జిల్లాలో నడుస్తున్న రాజకీయం. దీంతో వీరు వారికి గాలం వేయడం.. వారు వీరికి గాలం వేయడం నిత్యకృత్యమైపోయింది. ఫలితంగా ఆ నియోజకవర్గంలో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ ఆ కాన్‌స్టిట్యుయన్సీ ఏది..? 

ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. ఇప్పటివరకు నియోజకవర్గంలో తమకు ఎదురులేదనుకున్న దగ్గుబాటి కుటుంబం జగన్ను కలవటంతో అధికార పార్టీ ఎమ్మెల్యే ఏలురి సాంబశివరావు.. అలర్టయ్యారు. తన వ్యూహాలకు పదును పెట్టి దగ్గుబాటికి వ్యతిరేకంగా పావులు కదిపారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ సమన్వయకర్తగా పనిచేస్తూ టికెట్  ఆశిస్తున్న రావి రామానంద బాబు అసంతృప్తి వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఆ పార్టీలో కుంపట్లను రాజేశారు. దీంతో దగ్గుబాటి రాకను వ్యతిరేకిస్తున్న  రావి రామానందబాబు వర్గం రోడ్డుకెక్కి ఆందోళన చేపట్టింది.

అసంతృప్తి వాదుల్ని ఏకం చేసే పనిలో దగ్గుబాటి
2014లో టీడీపీ నుంచి గెలిచిన ఏలూరి 
నివురుగప్పిన నిప్పులా అధికార పార్టీలో అసమ్మతి 
2 వేల మంది కార్యకర్తలతో సమావేశం 
రెబల్‌ను రంగంలోకి దించుతామని హెచ్చరికలు

ఈ అనూహ్య పరిణామాలను పసిగట్టిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. టీడీపీ వైపు వెళ్లిన తన అనుచరవర్గంతో పాటు అసంతృప్తి వాదులను ఏకం చేసే పనిలో పడ్డారు. 2014లో టీడీపీ నుంచి విజయం సాధించిన ఏలూరి సాoబశివరావు.. టీడీపీ కార్యకర్తలను కాదని.. ప్రత్యేకంగా తన వర్గాన్ని తయారు చేసుకున్నారు. అప్పట్నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న అధికార పార్టీ అసమ్మతి నేతలు తమకంటూ టైమ్ రావడంతో దెబ్బ కొట్టేందుకు ఏకమయ్యారు. మూడు మండలాలకి సంబంధించిన 30 మంది కీలక నాయకులు తమ ఏలుబడిలో ఉన్న గ్రామాల్లోని 2 వేల మంది కార్యకర్తలతో సమావేశం కావటం అధికార పార్టీలో సంచలనం రేపుతోంది. తమను చులకనగా చూసిన ఏలూరికి అనుకూలంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే.. రెబల్ అభ్యర్థిని రంగంలోకి దించి తమ సత్తా చాటుతామని టీడీపీ అసమ్మతి వర్గం హెచ్చరిస్తోoది.

దీంతో ఇప్పుడు ఏలూరి దగ్గుబాటికి చెందిన మరో వర్గాన్ని రెచ్చగొట్టే పనిలో పడ్డారట. ఇలా అధికార, ప్రతిపక్షాలు అసంతృప్తి నేతల్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలను నడుపుతుండడంతో ఎవరు ఏ క్షణంలో ఏ పార్టీలో తేలుతారోననేది ప్రశ్నార్థకంగా మారింది.