వృద్ధుడిని చంపేసిన పంది
పందులు దాడిచేసి ఓ వృద్ధుడిని చంపేసిన ఘటన నాగర్కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో జరిగింది.
పందులు దాడిచేసి ఓ వృద్ధుడిని చంపేసిన ఘటన నాగర్కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో జరిగింది.
పందులు దాడిచేసి ఓ వృద్ధుడిని చంపేసిన ఘటన నాగర్కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో జరిగింది. కొండయ్య అనే వృద్ధుడు నడవటానికి కూడా చేతకాని పరిస్థితిలో ఓ ఇంట్లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఓ పంది అతనిపై దాడి చేసింది. తల, చేతిని పీక్కుతింది. దీంతో కొండయ్య అక్కడికక్కడే చనిపోయాడు.
ఈ ఘటనతో గ్రామస్తులు పందులను చూసి భయాందోళనకు గురవుతున్నారు. గతంలోనే గ్రామంలో పందులు పెంచుతున్న వారికి పంచాయతీ తరపున నోటీస్లు కూడా ఇచ్చారు. గ్రామంలోని పందులను వేరే ప్రాంతానికి తరలించాలని చెప్పారు. అయినా పరిస్థితిలో మార్పులేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.