కొత్త ట్విస్ట్ : జ్యోతి మృత దేహానికి రీ పోస్ట్ మార్టం 

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 07:29 AM IST
కొత్త ట్విస్ట్ : జ్యోతి మృత దేహానికి రీ పోస్ట్ మార్టం 

గుంటూరు : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు ఉడా కాలనీ వద్ద రెండ్రోజులు కిందట చోటుచేసుకున్న జ్యోతి అత్యాచారం..హత్య కేసు పలు  మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో తాడేపల్లిలోని శ్మశానం నుంచి జ్యోతి మృతదేహాన్ని  వెలికి తీసి తహశీల్దార్‌, అడిషనల్ ఎస్పీ..ఇతర అధికారులు సమక్షంలోనే రీపోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. దీనికోసం గుంటూరు నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ ను తీసుకొచ్చారు.

జ్యోతి మృతి తరువాత జరిగిన పోస్ట్ మార్టంలో సరిగా జరగలేదనీ..ఈ కేసు విచారణలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎస్సై, సీఐలను అధికారులు సస్పెండ్ చేశారు. జ్యోతి మృతదేహానికి మొదటిసారి పోస్ట్ మార్టం జరిగిన అనంతరం జ్యోతికి సంబంధించిన దుస్తులు..వాచ్ వంటివి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ క్రమంలో బుధవారం (ఫిబ్రవరి 13)న కొందరు పోలీసులమని చెప్పి జ్యోతి దుస్తులు..వాచ్ వంటివి తీసుకెళ్లటంపై అనుమానం వచ్చిన బంధువులు పీఎస్ ముందు ధర్నా చేయటంతో సంబంధిత అధికారులు జ్యోతి మృతదేహానికి మరోసారి పోస్ట్ మార్టం  నిర్వహిస్తున్నారు.