రిపబ్లిక్ యాంకర్ వికాస్ శర్మ కన్నుమూత
రిపబ్లిక్ ఇండియా టీవీకి చెందిన ప్రముఖ యాంకర్ వికాస్ శర్మ కన్నుమూశారు. మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వికాస్ శర్మ గురువారం(04 ఫిబ్రవరి 2021) రాత్రి నోయిడాలోని కైలాష్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అతనికి తీవ్ర జ్వరం రాగా.. ఆసుపత్రిలో చేరారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన వికాస్ శర్మ.. కోలుకుని ఇంటికి వచ్చారు.
అయితే, ఇప్పుడు సడెన్గా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి అక్కడే చనిపోయారు. రాత్రి 9 గంటలకు యే భారత్ కి బాత్ హై షోకు వ్యాఖ్యాతగా వికాస్ శర్మ వ్యవహరించేవారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి తన న్యూస్ నెట్వర్క్కు ఇది తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. వికాస్ ఎప్పుడూ కూడా సమాజం కోసం ఆలోచించే వ్యక్తి అని, చాలా టాలెంటెడ్ అని అర్నాబ్ గోస్వామి అన్నారు.
వికాస్ శర్మ మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు నుంచి, అనేకమంది సంతాపం తెలిపారు. ట్విట్టర్లో వికాస్ శర్మ మరణం ట్రెండ్ అవుతోంది. వికాస్ 35ఏళ్ల వయస్సులోనే ఈ లోకం విడిచి వెళ్లిపోగా.. కాన్పూర్ నివాసి అయిన వికాస్కు భార్య, ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు.
Unbelievable Life Is So Unpredictable Very Shocked You Will Be Missed Forever #RIPVikasSharma pic.twitter.com/E6irDOe631
— Narendra Modi fan (@narendramodi177) February 4, 2021