కియా మోటార్స్ తరలింపుపై కథనాన్ని తొలగించిన రాయిటర్స్

ఏపీలో 3 రాజధానుల వ్యవహారం కొనసాగుతుండగానే కియా మోటార్స్ తరలింపు అంశం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కియా మోటార్స్ తరలింపుపై తమ కథనాన్ని రాయిటర్స్ తొలిగించింది.

  • Published By: veegamteam ,Published On : February 8, 2020 / 03:05 PM IST
కియా మోటార్స్ తరలింపుపై కథనాన్ని తొలగించిన రాయిటర్స్

ఏపీలో 3 రాజధానుల వ్యవహారం కొనసాగుతుండగానే కియా మోటార్స్ తరలింపు అంశం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కియా మోటార్స్ తరలింపుపై తమ కథనాన్ని రాయిటర్స్ తొలిగించింది.

ఏపీలో 3 రాజధానుల వ్యవహారం కొనసాగుతుండగానే కియా మోటార్స్ తరలింపు అంశం కలకలం రేపింది. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ఏపీ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ రాసిన కథనం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. రాయిటర్స్ ప్రకనటతో ఏపీలో అధికార, విపక్షాల మధ్య రచ్చ కొనసాగింది. కియా మోటర్స్ తరలింపుపై అసత్య ప్రచారంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో కియా మోటార్స్ తరలింపుపై తమ కథనాన్ని రాయిటర్స్ తొలిగించింది. తమ అవాస్తవ కథనాన్ని తొలగిస్తున్నామని ట్విట్టర్ ద్వారా రాయిటర్స్ ప్రకటించింది.

కియా మోటార్స్ తరలిపోతుందంటూ రాయిటర్స్ ప్రకటన 
ఏపీ నుంచి కియా మోటార్స్ తరలిపోతుందంటూ రాయిటర్స్ రెండు రోజుల క్రితం ప్రకటన చేసింది. ఏపీలో ఉన్న తన 1.1 బిలియన్ డాలర్ల విలువైన ప్లాంట్‌ను పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రానికి మార్చేందుకు కియా చర్చలు జరుపుతున్నట్లు రాయిటర్స్ సంచలన కథ రాసింది. రాయిటర్స్ ప్రకనటతో ఏపీలో దుమారం రేగింది. అధికార, విపక్షాల మధ్య రచ్చ జరిగింది. విపక్షాలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు చేసింది. కియాపై రాయిటర్స్ కథనం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ ప్రభుత్వం, కియా మోటార్స్ స్పందించాయి. 

కియా తరలింపు ప్రచారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్  
కియా మోటర్స్ తరలింపు ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీయడానికి చేసిన కుట్రగా సర్కార్ భావిస్తోంది. దీని వెనుక ఎవరున్నారనే అంశంపై దృష్టి పెట్టింది. అసత్య ప్రచారంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అలాగే కియా తరలింపుపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను వైసీపీ ప్రభుత్వం తిప్పికొట్టింది. పరిశ్రమను తరలించడం లేదని, జరుగుతున్న ప్రచారం వట్టిదేనని వెల్లడించింది.

స్పందించిన కంపెనీ యాజమాన్యం
అనంతపురం జిల్లా నుంచి కియా మోటార్స్ తరలిస్తున్నారనే దానిపై కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఇవన్నీ అవాస్తవాలంటూ వెల్లడించింది. కార్ల ఉత్పత్తికి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. కియాను తమిళనాడుకు తరలిస్తున్నామన్న వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. పరిశ్రమను తరలించడానికి ఎలాంటి చర్చలు జరపలేదని, భారత్‌లో దీర్ఘకాలికంగా కియా కార్లను ఉత్పత్తి చేసేందుకే అనంతపురంలో పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేసింది కియా యాజమాన్యం. కార్ల ఉత్పత్తికి పూర్తిస్థాయిలో ప్లాంట్ ఏర్పాటు చేశామని వెల్లడించింది. 

కియా మోటార్స్ తయారీ కేంద్రాన్ని మార్చే ఆలోచన లేదన్న ఎండీ
అనంతపురంలో కియా మోటార్స్ తయారీ కేంద్రాన్ని మార్చే ఆలోచన లేదని కియా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. అనంతపురం తయారీ కేంద్రంలో 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ ను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో మేడిన్ అనంతపూర్ వాహనాలను భారత వినియోగదారులకు అందించేందుకు పని చేస్తున్నామని తెలిపారు. భారత్ మార్కెట్ లో దీర్ఘకాల సేవలు అందించేందుకు కియా సిద్ధంగా ఉందన్నారు. ఈ క్రమంలో కియా మోటార్స్ తరలింపుపై తమ కథనాన్ని తొలిగించినట్లు రాయిటర్స్ తెలిపింది. తమ అవాస్తవ కథనాన్ని తొలగిస్తున్నామని ట్విట్టర్ ద్వారా రాయిటర్స్ ప్రకటించింది.