టీడీపీ మేనిఫెస్టో:  150+ సీట్లే లక్ష్యంగా రూపకల్పన

  • Published By: vamsi ,Published On : March 21, 2019 / 02:18 AM IST
టీడీపీ మేనిఫెస్టో:  150+ సీట్లే లక్ష్యంగా రూపకల్పన

ఎన్నికలకు ఇంక ఎంతో సమయం లేదు. సరిగ్గా మూడువారాల గడువు ఉంది. ఈ క్రమంలో పార్టీలు ప్రచారాలను వేగం చేశాయి. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న టీడీపీ.. మేనిఫెస్టోను ఇవాళ(21 మార్చి 2019) విడుదల చేయబోతుంది. తన అపార అనుభవాన్ని రంగరిచి మేనిఫెస్టోను తయారు చేసిన చంద్రబాబు.. 150+ సీట్లే లక్ష్యంగా మేనిఫెస్టోని రూపొందించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పసుపు కుంకుమ, పెన్షన్లు, రైతు రుణ మాఫీ, పెట్టుబడి సాయం, నిరుద్యోగ బృతి, డ్వాక్రా రుణాలు, అన్న క్యాంటీన్లు వంటి పథకాలు ప్రవేశపెట్టిన చంద్రబాబు.. మరిన్ని పథాకాలను మేనిఫెస్టోలో పెట్టనున్నట్లు తెలుస్తుంది. తమ మేనిఫెస్టో అన్నీ వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుందని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. 
మరోవైపు జనసేన పార్టీ కూడా తన తాత్కాలిక మ్యానిఫెస్టోను విడుదల చేయగా.. పూర్తిస్థాయి మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తుంది. యువతే టార్గెట్‌గా అభ్యుదయ భావాలతో కూడిన మేనిఫెస్టోను ప్రకటిస్తామంటూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే జగన్ ఇప్పటికే నవరత్నాలు పేరుతో మేనిఫెస్టోను విడుదల చేయగా.. త్వరలో మరో రెండు రోజుల్లో కొన్ని మార్పులతో మరో మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.