సుప్రీంకోర్టు ఆమోదించినా..స్వలింగ సంపర్కుల వివాహాలు అంగీకరించం : కేంద్రం

  • Published By: nagamani ,Published On : September 15, 2020 / 12:37 PM IST
సుప్రీంకోర్టు ఆమోదించినా..స్వలింగ సంపర్కుల వివాహాలు అంగీకరించం : కేంద్రం

స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవటానికి తాము అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఆమోదించినా.. ఆ వివాహాలను తాము ఒప్పుకోబోమని కేంద్రం హైకోర్టుకు స్పష్టంచేసింది.


ఒకే లింగానికి సంబంధించిన జంటల వివాహాన్ని మన విలువలు, చట్టాలు, న్యాయవ్యవస్థ, సమాజం గుర్తించలేదని..దీనికి సమాజం ఆమోదించదనీ..ఇటువంటి వివాహాలను అనుమతించలేమని కేంద్రం స్పష్టంచేసింది. హెచ్ఎంఏ(హిందూ వివాహ చట్టం), ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంతో కేంద్రం దీనిపై ధర్మాసనానికి క్లారిటీ ఇస్తూ ఈ విషయాన్ని తెలిపింది.



https://10tv.in/sc-asks-centre-why-no-ban-on-disinfectant-tunnels-despite-saying-chemicals-harmful/
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ ప్రతీక్‌ జలాన్‌ల ఎదుట సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ప్రభుత్వ వాదనను వినిపిస్తూ..ఇటువంటి వివాహాలను మన చట్టాలు, సమాజం, న్యాయవ్యవస్థ గుర్తించవని తెలిపారు. ఈ తరహా వివాహాలకు అనుమతిస్తూ పిటిషనర్‌ కోరిన విషయాన్ని జనరల్ తుషార్ మెహతా తప్పుబట్టారు. ఈ తరహా వివాహాలను చట్టబద్ధం చేయాలని..స్వలింగ సంపర్కులకు ఊరట కల్పించాలని పిటిషనర్‌ కోరగా.. ఇందుకు అనుమతిస్తే ఇది పలు చట్ట నిబంధనలకు విరుద్ధం అవుతుందని పేర్కొన్నారు.


‘హిందూ వివాహ చట్టంలో వివాహాల నియంత్రణ.. వివాహేతర సంబంధాల నివారణకు పలు నిబంధనలు.. భార్య, భర్తల గురించి ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. అటువంటి ఈ పాత్రలను మనం స్వలింగ జంటల్లో ఎలా చూస్తాం? అంటూ ప్రశ్నించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పద్ధతులు మారిపోతున్నాయని.. అవి భారత్‌కు వర్తించవచ్చు, వర్తింపకపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి పరిస్థితుల్లో ఇక ఈ కేసులో పిటిషన్‌ అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. స్వలింగ సంపర్క వివాహాలకు ప్రభావితం అయ్యేవారు బాగా చదువుకున్నవారని.. వారే నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టంచేసింది.


అలాగే స్వలింగ వివాహాన్ని రిజిస్టర్‌ చేసేందుకు నిరాకరణకు గురైన వ్యక్తుల వివరాలు ఇవ్వాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది అభిజిత్‌ అయ్యర్‌ మిత్రాను కోర్టు కోరింది. తదుపరి విచారణ అక్టోబర్‌ 21కి వాయిదా పడింది.