మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. ఐదుగురే అతిధులు

  • Published By: vamsi ,Published On : April 11, 2020 / 06:19 AM IST
మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. ఐదుగురే అతిధులు

కరోనా సమయంలో పెళ్లి కళ తగ్గిపోయింది.. అనుకున్న వాళ్లే.. కాదు.. అయినవాళ్లు కూడా రాలేని పరిస్థిత ప్రస్తుతం రాష్ట్రంలోనూ.. దేశంలోనూ… ప్రపంచంలో కూడా… నూరేళ్ల పెళ్లి బంధాన్ని, ఘనంగా.. ఎంతో ఆనందంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు కదా? అయితే ఘనంగా చేసుకున్నా కూడా ఎవ్వరూ రాలేని, రాకూడని పరిస్థితులు ప్రస్తుతం బయట ఉన్నాయి. (ఆన్ లైన్ లో పాఠాలు : యాప్ Zoom లో అశ్లీల సీన్స్..షాక్ తిన్న టీచర్లు, స్టూడెంట్స్)

ఇటువంటి సమయంలోనే విశాఖ జిల్లా అనకాపల్లిలో గురువారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి ఓ పురోహితునితో పాటు పెళ్లి కుమారుని తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, కెమెరా మెన్ తప్ప ఎవరూ హాజరుకాలేదు. మూడు ముళ్ల బంధానికి ఈ ఐదుగురే అతిధులు కాగా.. వారు కూడా మాస్కులు ధరించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ దుక్కవానిపాలెంలో శుక్రవారం జరిగిన మరో వివాహాన్ని కూడా పురోహితుడు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెళ్లి కుమారుని తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగింది. కరోనా పుణ్యమా అని పెళ్లి తంతులు రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా తూతూమంత్రంగానే సాగుతున్నాయి.