తల్లిదండ్రులను రాడ్డుతో కొట్టి చంపిన కొడుకు 

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 06:18 AM IST
తల్లిదండ్రులను రాడ్డుతో కొట్టి చంపిన కొడుకు 

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం రూరల్ మండలం కడియద్దలో దారుణం జరిగింది. కన్న తల్లిదండ్రులు ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు ఓ కొడుకు.

కడియద్ద గ్రామానికి చెందని నాగేశ్వర రావు, మార్తమ్మలకు  రమేశ్ అనే కొడుకు ఉన్నాడు. గత కొంతకాలంగా రమేశ్ కు మానసిక పరిస్థితి సరిగా లేదు. దీంతో రమేశ్ భార్య అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తల్లిదండ్రులపై రమేశ్ ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావంతో నాగేశ్వర రావు, మార్తమ్మలు పెద్ద పెద్ద కేకలు వేశారు. ఈ కేకలు విన్న చుట్టుపక్కలవారు వచ్చారు. దీంతో రమేశ్ పరారయ్యాడు. 

ఇనుప రాడ్డుతో కొడుకు చేసిన దాడిలో భార్యాభర్తలిద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. కాగా రమేశ్ కు మతిస్థిమితం లేదనీ..రమేశ్ మాసిసిక రుగ్మతతో బాధపడుతున్నాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో పోలీసులకు సమాచారం అందించగా..ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారైన రమేశ్ కోసం గాలిస్తున్నారు.