సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ : విద్యార్థి మృతి

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తో ఓ విద్యార్థి మృతి చెందాడు.

  • Published By: veegamteam ,Published On : September 8, 2019 / 03:39 AM IST
సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ : విద్యార్థి మృతి

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తో ఓ విద్యార్థి మృతి చెందాడు.

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తో ఓ విద్యార్థి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. అచ్చంపేట మండలంలోని జోగ్యతండాకు చెందిన గిరిజన విద్యార్థి అన్వేష్ కుమార్ (17) పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు.

శుక్రవారం గ్రామంలో వినాయకుడి నిమజ్జనంలో అన్వేష్ కుమార్ పాల్గొని, తిరిగి ఇంటికి వెళ్లి అర్ధరాత్రి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పిటల్ లో మృతదేహానికి పోస్టుమార్టం చేశారు.