ప్రభుత్వ మద్యం షాపులో భారీ చోరీ: సూపర్‌వైజరే దొంగ

  • Published By: vamsi ,Published On : December 23, 2019 / 06:01 AM IST
ప్రభుత్వ మద్యం షాపులో భారీ చోరీ:  సూపర్‌వైజరే దొంగ

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణంలో డిగ్రీ చదివిన వ్యక్తులను సూపర్‌వైజర్‌లుగా పెట్టింది ప్రభుత్వం. అయితే అనంతపురం జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేసే సూపర్‌వైజరే షాపులోని డబ్బు తీసుకుని పారిపోయాడు. మద్యం షాపులో ఏకంగా రూ. 9.12 లక్షలు సొమ్ము తీసుకుని పరారయ్యాడు.

అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రభుత్వ మద్యం దుకాణంలో శ్రీనాథ్ అనే వ్యక్తి సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. శ్రీనాథ్ దుకాణంలో మద్యం అమ్మకాలు చేయగా వచ్చిన రూ. 9.12 లక్షల నగదును చోరీ చేసి ఎక్కడికో పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

మద్యపాన నిషేధానికి మొదటి అడుగుగా మద్యం దుకాణాల నిర్వహణ చెపట్టిన ఆంధ్రప్రదేశ్ సర్కారు.. దుకాణాలను నిర్వహించేందుకు ఇంటర్వ్యూల ద్వారా సూపర్‌వైజర్లను నియమించింది. అలాగే సేల్స్‌మ్యాన్స్, సెక్యూరిటీని కూడా కాంట్రాక్టు పద్ధతిలో నియమించింది.