20 నిమిషాల్లో కరోనాను ఖతం చేసే మౌత్స్ప్రే విడుదల చేసిన స్వీడన్ ఎంజైమాటికా
కరోనా వైరస్కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో ప్రపంచ దేశాలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. వారి వారి వ్యాక్సిన్ ను సక్సెస్ చేయటానికి తద్వారా వ్యాక్సిన్ సాధించిన ఘనత కోసం ప్రపంచ దేశాలన్నితలమునకలయ్యాయి. ఈ క్రమంలో స్వీడన్కు చెందిన లైఫ్ సైన్స్ సంస్థ ఎంజైమాటికా ఓ మౌత్ స్ప్రేను విడుదల చేసింది. ఈ మౌత్ స్ర్పే కేవలం 20 నిమిషాల్లో కరోనా వైరస్ ను ఖతం చేస్తుందని అంటున్నారు నిర్వాహకులు. కోల్డ్ జైమ్ మౌత్ స్ప్రే పేరుతో తీసుకొచ్చిన ఈ స్ప్రే నోటిలోని 98.3 శాతం వైరస్ను చంపేస్తుందని సంస్థ వెల్లడించింది.
సాధారణ జలుబును అతి త్వరగా తగ్గించడంతోపాటు కరోనా వైరస్ కు సంబంధించిన సార్స్-కోవ్-2 వైరస్ను నోటిలోనే నాశనం చేస్తుందని తమ పరిశోధనల్లో తేలిందని పేర్కొంది. 20 నిమిషాల వ్యవధిలోనే వైరస్ను క్రియారహితం చేస్తుందని ఎంజైమాటికా తెలిపింది. అంతేకాదు ఈ స్ప్రే వాడటం వల్ల ఎటెవంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని తెలిపింది. నిజానికీ స్ప్రేను సాధారణ జలుబు నివారణ కోసం అభివృద్ధి చేసినా కరోనాతోపాటు వివిధ రకాల వైరస్లను ఇది అడ్డుకుంటుందని పరిశోధకులు తెలిపారు. దీని తయారీలో గ్లిజరాల్, అట్లాంటిక్ కాడ్ ట్రిప్నిన్లు ఉపయోగించినట్టు వివరించారు.
ఈ పరిశోధనను యుఎస్ కంపెనీ మైక్రోబాక్ లాబొరేటరీస్ ఇంక్ నిర్వహించిందనీ..ఇది స్వతంత్ర, గుర్తింపు పొందిన..ధృవీకరించబడిన లాబరేటరీ అని ఎంజైమాటికా కంపెనీ తెలిపింది. ఈ స్ర్పే చక్కటి ఫలితాలను సూచిస్తోందని ఎంజైమాటికా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ క్లాజ్ ఎగ్ స్ట్రాండ్ తెలిపారు.