మణియమ్మల్..నా దేవతవు నీవే : భార్య బొమ్మతోనే ఆయన ముచ్చట్లు
తన కష్టసుఖాల్లో పాలుపంచుకుని తనకు కొండంత అండగా..ధైర్యం చెప్పే జీవన సహచరి మరణంతో కృంగిపోయాడో భర్త. పెళ్లి అయి కన్నవారిని వదిలి తన చేయి పట్టుకుని వచ్చిన నాటి నుంచి 48 ఏళ్లపాటు తనలో సగమైన భార్య మరణంతో చిన్నపిల్లాడిలా తల్లడిల్లిపోయాడు మధురైకి చెందిన సేతురామన్ అనే వ్యాపారవేత్త. బైటకెళితే భార్య ఎదురు రావాల్సిందే. ఆమె ముఖం చూడకుండా ఏ పనిచేసేవాడు కాదు. అటువంటి భార్య మరణంతో ఒంటరివాడైపోయాడు.
దీంతో ఆమె దూరం భరించలేక అచ్చు భార్యలాంటి విగ్రహాన్ని చేయించుకుని ఇంట్లో పెట్టుకున్నాడు సేతురామన్. భార్య బ్రతికి ఉన్నప్పుడు ఎలా ఆమెతో ఎలా మాట్లాడేవాడో..ఇద్దరు సరదాగా పక్క పక్కనే కూర్చుని ఎన్ని ముచ్చట్లు చెప్పుకునేవారో అచ్చు అలాగే తన మనస్సులోని మాటలన్నీ భార్య బొమ్మతో చెప్పుకుంటున్నాడు. 48 ఏళ్ల దాంపత్య జీవితంలో భార్యతో తన జ్ఞాపకాలను ఆ బొమ్మలో చూసుకుంటున్నాడు. ఫైబర్ రబ్బర్తో కేవలం 30 రోజుల్లోనే భార్య బొమ్మను తయారు చేయించుకున్నాడు సేతురామన్.
https://10tv.in/delhi-women-serial-bride-marries-8-senior-citizens-in-11-years-booked/
సేతురామన్ భార్య మణియమ్మల్ నెల రోజుల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి ఒంటరి తనాన్ని గడపలేక..భార్యను మరచిపోలేక మానసికంగా ఆవేదన చెందుతున్నాడు. దీంతో అచ్చు భార్యలా ఉండే ఓ విగ్రహం చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా..విల్లుపురానికి చెందిన శిల్పి ప్రసన్నను సంప్రదించి భార్య విగ్రహాన్ని అచ్చు ఆమె బ్రతికి ఉన్నట్లుగానే జీవకళ ఉట్టిపడుతున్నట్లుగా..ప్రాణం ఉన్నట్టుగానే తయారు చేయించుకున్నాడు.
భార్యతో అన్ని విషయాలు మాట్లాడాడు..ప్రతీరోజు భార్య పక్కనే కూర్చుని ఎన్నో ముచ్చట్లు చెబుతాడు. అలా తన భార్య చనిపోలేదనీ..తనతోనే ఉందని నమ్ముతున్నాడు సేతురామన్.
Tamil Nadu: Sethuraman, a businessman from Madurai unveiled a statue of his wife,Pitchaimaniammal,at his home after 30 days of her demise.
He says,”I lost my wife recently but when I look at this statue I can connect with her.Fibre,rubber & special colours were used to make it” pic.twitter.com/l5iykI8UCw
— ANI (@ANI) September 11, 2020