తప్పిన పెను ప్రమాదం : కుప్పకూలిన డ్రాగన్ ట్రైన్

  • Published By: madhu ,Published On : January 20, 2019 / 12:50 AM IST
తప్పిన పెను ప్రమాదం : కుప్పకూలిన డ్రాగన్ ట్రైన్

పశ్చిమగోదావరి : జిల్లా తణుకులో పెను ప్రమాదం తప్పింది. మాధురి ట్రేడ్‌ ఎగ్జిబిషన్‌లో చిన్న పిల్లల డ్రాగన్‌ ట్రైన్‌ రన్నింగ్‌లో కుప్పకూలింది. దీంతో చిన్నారులంతా కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి కాలు విరగగా…ఆరుగురికి గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు చిన్నారులను బయటకు లాగారు. ఈ ప్రమాద సమయంలో ట్రైన్‌లో 40 మంది చిన్నారులున్నారు. ట్రైన్‌ వేగం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. నిర్వాహకులు సరిగా పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.