పోలీసుల నోటీస్ తిరస్కరించిన గల్లా జయదేవ్ : టీడీపీలో ఉంటే అరెస్టులు చేస్తారా?

టీడీపీ నేత గల్లా జయదేవ్ కు పోలీసులు నోటీస్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీస్ ను జయదేవ్  తిరస్కరించారు. ఎందుకు హౌస్ అరెస్టు చేశారో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 05:36 AM IST
పోలీసుల నోటీస్ తిరస్కరించిన గల్లా జయదేవ్ : టీడీపీలో ఉంటే అరెస్టులు చేస్తారా?

టీడీపీ నేత గల్లా జయదేవ్ కు పోలీసులు నోటీస్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీస్ ను జయదేవ్  తిరస్కరించారు. ఎందుకు హౌస్ అరెస్టు చేశారో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నేత గల్లా జయదేవ్ కు పోలీసులు నోటీస్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీస్ ను జయదేవ్  తిరస్కరించారు. తనను హౌస్ అరెస్టు చేయడంపై సీరియస్ అయ్యారు. ఎందుకు హౌస్ అరెస్టు చేశారో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో ఉంటే ఇష్టానుసారంగా అరెస్టులు చేస్తారా అని మండిపడ్డారు. పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. బయటకు వెళ్తా..ఏం చేసుకుంటారో చేసుకోండని పోలీసులకు సవాల్ విసిరారు. బయటకు వెళ్లేందుకు యత్నించిన జయదేవ్ ను పోలీసులు అడ్డుకున్నారు. 

 

కమిటీలతో ఉపయోగం లేదన్నారు. 20 రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నా.. జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిస్తున్నట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్ర, ప్రధాని మోడీ, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అభివృద్ధి అనేది రాజధాని మార్పు చేస్తే జరగదన్నారు. 

 

రాజధాని రైతుల ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. మూడు రాజధానులు వద్దు-అమరావతే ముద్దంటూ నినాదాలతో హొరెత్తిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. రాజధాని కోసం రైతులు చేపట్టిన ఆందోళన ఇవాళ్టికి 21వ రోజుకు చేరింది. ఆందోళనల్లో భాగంగా ఇవాళ NH-16 దిగ్బంధంతో కదం తొక్కుతున్నారు.  ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గేవరకు తమ ఆందోళనలు విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

 

రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీల నేతలు తమ ఉద్యమానికి మద్దతివ్వాలని అమరావతి పరిరక్షణ సమితి పిలుపునివ్వడంతో  రైతుల పోరుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. హైవే దిగ్బంధంలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. అయితే… జాతీయ రహదారి దిగ్బంధానికి అనుమతి లేదంటున్న పోలీసులు… ఆందోళనల్లో టీడీపీ కూడా పాల్గొనటుండటంతో అలర్ట్‌ అయ్యారు.

 

గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌, మాజీమంత్రి నక్కా ఆనందబాబుతోపాటు టీడీపీ ఇంఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర, జనసేన నేత శ్రీనివాస్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలోనూ టీడీపీ నాయకులను ముందుస్తు అరెస్టులు చేశారు పోలీసులు.

 

విజయవాడ, పెనమలూరు నియోజకవర్గాల్లోని నేతలు, కార్యకర్తలను గృహనిర్బంధం చేశారు. పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్‌ను హౌస్‌ అరెస్ట్ చేశారు. చినకాకాని, కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి… గ్రామాల నుంచి ఎవరూ బయటకు రాకుండా ఆంక్షలు విధించారు.